రానా తో రొమాన్స్ కి రెడీ అంటున్న ప‌వ‌ర్ స్టార్ హీరోయిన్..

  • IndiaGlitz, [Monday,April 18 2016]

లీడ‌ర్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన రానా తొలి చిత్రంతో విజ‌యం సాధించినా...ఆత‌ర్వాత సోలో హీరోగా మాత్రం స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు. నా ఇష్టం, నేను నా రాక్ష‌సి..ఇలా సోలో హీరోగా సినిమాలు చేసినా విజ‌యం మాత్రం సాధించ‌లేక‌పోయాడు. అయితే బాహుబ‌లి సినిమాతో రానా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు రానా సోలో హీరోగా స‌క్సెస్ సాధించాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం రానా బాహుబ‌లి 2 లో న‌టిస్తున్నాడు.

ఇదిలా ఉంటే... రానా కోసం తేజ ఓ క‌థ రెడీ చేసి ఇటీవ‌ల వినిపించాడ‌ట‌. క‌థ విని రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. రానా - తేజ కాంబినేష‌న్లో రూపొందే ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న ప‌వ‌ర్ స్టార్ హీరోయిన్ న‌టిస్తుంద‌ట‌. ఇంత‌కీ ప‌వ‌ర్ స్టార్ హీరోయిన్ ఎవ‌రనుకుంటున్నారా..? స‌ర్ధార్ లో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టించిన కాజ‌ల్. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమా ద్వారానే కాజ‌ల్ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయ్యింది. అందుక‌నే అనుకుంట త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు తేజ క‌థ చెప్ప‌గానే వెంట‌నే కాజ‌ల్ ఓకే చెప్పింద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

ఈనెల 29న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ రహదారి

సేతు,అభిషేక్,రాజ్,పూజ,ఉమాశంకర్,శ్వేత,విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నచిత్రం రహదారి.యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ ప్రజెంట్ టార్గెట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని...రాజకీయాల్లో ప్రవేశించాకా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాను అని ప్రకటించారు.

శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో 'కుమారి 21ఎఫ్‌'

రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మించిన చిత్రం  'కుమారి 21ఎఫ్‌. ఈ చిత్రం' తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అమ్మకు అఖిల్ అభినంద‌న‌

అమ్మ అమ‌ల‌కు అఖిల్ అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఇంత‌కీ ఎందుకు అభినందించాడంటే...నాగార్జున స‌హ‌కారంతో అమ‌ల బ్లాక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవ‌త్స‌రాలుగా  జంతువులను సంర‌క్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విష‌యం తెలిసిందే.

మే 6న వ‌స్తున్న స్పెష‌ల్ ఫిల్మ్ 24 అంద‌రికీ న‌చ్చుతుంది - సూర్య‌

సూర్య హీరోగా న‌టిస్తూ..నిర్మించిన చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై  24 మూవీని తెలుగు, త‌మిళ్ లో సూర్య నిర్మించ‌డం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 మూవీని మే 6న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు