మహేశ్తో నటించడం లక్కీ ఏం కాదు.. రష్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలై తొలి షెడ్యూల్ పూర్తవ్వగా త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అంతేకాదు షూటింగ్ మధ్యలో మహేశ్ లుక్.. సినిమాలో ఆయన పాత్రేంటన్నది..? ఇప్పటికే రివీలయ్యాయి. దీంతో వాట్ నెక్స్ట్ అంటూ అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో వేచి చూస్తున్నారు. తాజాగా ‘డియర్ కామ్రేడ్’లో ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
లక్కీనా అదేం కాదే!!
మహేశ్ బాబుతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సరే చాలా లక్కీగా ఫీలవుతుంది. అంతేకాదు.. బాలీవుడ్ హీరోయిన్లు సైతం మహేశ్తో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోమని.. ఇదివరకే పలుమార్లు చెప్పిన విషయం విదితమే. అయితే రష్మికా మందన్నా మాత్రం.. తానేం లక్కీ అని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ఎలాంటి అవకాశాలైనా సరే హార్డ్ వర్క్ వల్లే వస్తాయని తాను నమ్ముతానని చెబుతోంది. తాను హార్డ్ వర్క్ చెయ్యడం వల్లే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు..!
"మహేష్ బాబుతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. ‘ఫస్ట్ షెడ్యూల్ లో నా రోల్కి సంబంధించి ఎలాంటి షూట్ లేదు. దీంతో మహేష్తో కలిసి వర్క్ చేయలేకపొయాను. అయితే తదుపరి అంటే రెండో షెడ్యూల్లో మహేశ్తో కలిసి నటించడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నాను. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకూ ఒకేఒక్కసారి మాత్రమే మహేష్ బాబును కలిశానంతే. నిజంగా చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మహేశ్ నుంచి చాలా నేర్చుకోవాలి.. నేర్చుకోవచ్చు" అని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. అయితే మహేశ్ నుంచి ఏమేం నేర్చుకుంటుందో..? వేచి చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.