'క్రాక్‌' ట్రైలర్‌.. పక్కా మాస్‌

  • IndiaGlitz, [Friday,January 01 2021]

మాస్‌ మహారాజా రవితేజ సినిమా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలాంటి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం 'క్రాక్‌'.. అని కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైన టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నెగటివ్‌ షేడ్స్‌లో నటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పోతురాజు వీర శంకర్‌గా రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో మెప్పించనున్నాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. సరస్వతి ఫిలింస్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాన్‌ శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం. సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే మిలియన్ మార్క్ ను టచ్ చేసింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమాను తెరకెక్కించిన తీరు, రవితేజ పాత్రను డిజైన్ చేసిన తీరు సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.

More News

కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత నెల 13న కరోనా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

టీపీసీసీ చీఫ్ ఎవరో తేలకముందే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఒకవైపు చర్చలు జరుగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించడం

కులాంతర వివాహం చేసుకున్నాడని.. వెంటాడి మరీ హతమార్చారు

పరువు హత్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అడుగులు ముందుకు పడుతుంటే.. కులం, మతం విషయంలో మాత్రం వెనక్కి పడుతున్నాయి.

‘రాధేశ్యామ్’ ప్రభాస్ లేటెస్ట్ లుక్.. విడుదల తేదీ ఫిక్స్?

‘సాహో’ తరువాత యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో లేటెస్ట్‌ మూవీ 'రాధేశ్యామ్' తెరకెక్కుతున్న విషయం

బిగ్‌బాస్ 4... చిరు కుమ్మేశారు.. టీఆర్పీ దూసుకెళ్లింది

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌.. ఇటీవలే సీజన్‌ 4ను కంప్లీట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్-4లో ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లు తప్ప మిగిలినవన్నీ