జనానికి నచ్చని కథలతో సినిమా చేస్తానంటున్న రవితేజ...

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెర‌కెక్కించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా బెంగాల్ టైగ‌ర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. బెంగాల్ టైగ‌ర్ ప్ర‌మోష‌న్ లో భాగంగా ర‌వితేజ మీడియాతో మాట్లాడుతూ...కొత్త క‌థ‌ ల‌తో సినిమా చేయాల‌ని ఉద్దేశ్యంతో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, శంభో శివ శంభో, నేనింతే..చిత్రాలు చేసాను. కానీ అవి జ‌నానికి న‌చ్చ‌లేదు. అయినా...జ‌నానికి న‌చ్చ‌ని అలాంటి క‌థ‌లు ఇప్పుడు వ‌చ్చినా చేయ‌డానికి నేను రెడీ. ఒక్కొసారి అవి న‌చ్చే అవ‌కాశం ఉంటుంది క‌దా.. అంటున్నారు. కొత్త క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌ని త‌పిస్తూ...అవి స‌క్సెస్ కాక‌పోయినా...అలాంటి కొత్త క‌థ‌ల‌తో సినిమాలు చేస్తానంటున్న ర‌వితేజ ఎంతైనా అభినంద‌నీయుడు. భ‌విష్యత్ లో ర‌వితేజ నుంచి మ‌రిన్ని మంచి క‌థ‌ల‌తో సినిమాలు వ‌స్తాయ‌ని ఆశిద్దాం.