మార్చి 1న రామారావు ఆన్ డ్యూటీ టీజర్.. రిలీజ్ డేట్ కూడా చెబుతారేమో..?

  • IndiaGlitz, [Saturday,February 26 2022]

మహారాజా రవితేజ వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ”. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.

“రామారావు ఆన్ డ్యూటీ” 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే అదే రోజున ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ వుండటంతో రామారావు కూడా విడుదలను ఆపుకున్నాడు. కాగా.. ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు చిత్ర యూనిట్ శనివారం అనౌన్స్ చేసింది. బహుశా అదే రోజున రిలీజ్ డేట్ కూడా చెబుతారేమో చూడాలి.

దీనితో పాటు నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘‘ధమాకా’’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు మాస్ మహారాజా. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. ఖిలాడీ మాదిరిగానే ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు వున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. అలాగే వంశీ తెరకెక్కిస్తున్న ‘‘టైగర్ నాగేశ్వ‌ర‌రావు’’. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘‘రావణాసుర’’ అనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్.

More News

ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్ధుల అవస్థలు ... విమాన ఖర్చులు భరించండి: అధికారులకు జగన్ ఆదేశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు వారి పౌరుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నల్గొండలో కుప్పకూలిన హెలికాఫ్టర్... ఇద్దరు మృతి, హృదయ విదారకంగా దృశ్యాలు

తమిళనాడులోని వెల్లింగ్టన్‌ వద్ద సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిన ఘటన దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్

తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది "డిస్నీ ప్లస్ హాట్ స్టార్". టెలివిజన్లో తెలుగు ప్రేక్షకులు కోరుకున్న స్థాయిని మించి ఊహించని వినోదాన్ని అందించిన "బిగ్ బాస్" ఇప్పుడు ఓటీటీలో

హైదరాబాద్‌లో ధమాకా కొత్త షెడ్యూల్.. రవితేజపై యాక్షన్ ఎపిసోడ్స్

మాస్ మహారాజ్ రవితేజ మంచి జోష్‌లో వున్న సంగతి తెలిసిందే. ఆయన చేతుల్లో నాలుగైదు సినిమాలు వున్నాయి.

గౌతంరెడ్డి జ్ఞాపకార్ధం రూ.225 కోట్ల విరాళం.. అలా చేయాలని జగన్‌ని కోరిన మేకపాటి ఫ్యామిలీ

ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.