బోల్డ్‌గా చేయడానికి నేను రెడీ.. : రెజీనా

  • IndiaGlitz, [Monday,August 12 2019]

కథ డిమాండ్ చేస్తే.. బోల్డ్‌గా నటించాల్సి వస్తే కచ్చితంగా నటిస్తానని రెజీనా చెబుతోంది. అయితే అనవసరమైన చోట బోల్డ్‌గా నటిస్తే ఫలితం ఏముంటుంది..? అయితే తాను బోల్డ్‌గా చేయను అనేదేమీ లేదు.. పరిస్థితిని బట్టి నటిస్తానని ఈ ముద్దుగుమ్మ తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం తాను తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో కూడా ఆఫర్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతం అవన్నీ స్టోరీ వినే దగ్గరే ఉన్నాయి. అంతేకాకుండా హిందీ సినిమా ఫైనల్‌ అయ్యింది.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని రెజీనా చెప్పుకొచ్చింది.

కాగా.. అడవి శేష్, రెజీనా నటీనటులుగా వెంక‌ట్ రామ్‌జీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎవరు’. పంద్రాగస్టు నాడు ప్రేక్షకుల ముందు ఈ సినిమా రానుంది. ఒక మర్డరీ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సస్పెన్స్.. సస్పెన్.. అంతా కథ ఇలానే సాగింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రెజీనా కాసాండ్రా సినిమాకు, తన ప్యూచర్ ప్రాజెక్ట్స్, అడవి శేష్ నటన గురించి పలు ఆసక్తికర విశేషాలు మీడియాతో ముచ్చటించిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.

More News

శేష్ సూపర్బ్.. నేను హ్యాపీ.. ‘ఎవరు’లో ఛాన్స్ రావడానికి..!

‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, రెజీనా నటీనటులుగా వెంక‌ట్ రామ్‌జీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎవరు’.

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం..: ‘జయహో’లో జగన్

‘ప్రజాసంకల్పయాత్ర’ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మకంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే.

సూపర్‌గుడ్‌ ఆర్‌.బి.చౌదరి తనయుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా 'నిరీక్షణ'

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.

పూరీ-విజయ్ సినిమా ఫిక్స్.. ప్రకటన వచ్చేసింది!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్టవ్వడంతో సూపర్ డూపర్ హిట్టవ్వడంతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మళ్లీ క్రీజులోకి వచ్చారు.

‘రణరంగం’ లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది! - కళ్యాణి ప్రియదర్శన్

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటీనటులుగా సుధీర్ వర్మ తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’.