close
Choose your channels

పూరీ-విజయ్ సినిమా ఫిక్స్.. ప్రకటన వచ్చేసింది!

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూరీ-విజయ్ సినిమా ఫిక్స్.. ప్రకటన వచ్చేసింది!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్టవ్వడంతో సూపర్ డూపర్ హిట్టవ్వడంతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మళ్లీ క్రీజులోకి వచ్చారు. దీంతో కుర్ర హీరోలంతా ఆయన కథ చెబితే రె‘ఢీ’ అంటున్నారు. ఆ కుర్ర హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ మీతో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పూరీతో ఇస్మార్ట్ హిట్ తర్వాత ఓ మాట చెప్పారట. గత కొన్నిరోజులుగా కథ పనిమీద ఉన్న పూరీ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను దేవరకొండ కోసం సిద్ధం చేశారు. మా ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందని అధికారికంగానే పూరీ క్లారిటీ ఇచ్చేశారు.

వాస్తవానికి ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని చాలా రోజులుగా పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. అయితే ఆ పుకార్లన్నీ అక్షరాలా నిజమయ్యాయి. స్వయానా పూరీనే సినిమా ఉందని క్లారిటీ ఇవ్వడం విజయ్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

ఈ సినిమాకు పూరి దర్శకత్వం వహిస్తుండగా... చార్మీ నిర్మాతగా వ్యవహరించనుంది. పూరి భార్య లావణ్య ఈ సినిమాను సమర్పిస్తున్నారు. సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేసేశారు. అంతేకాదు.. పూరి, చార్మీ, విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. కాగా సినిమా ఎప్పుడు..? ఎక్కడ ప్రారంభం అవుతుందనే విషయాలు మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.

కాగా.. ‘జై లవకుశ’ సినిమాలో ఎన్టీఆర్ మాదిరిగా విజయ్ దేవరకొండను కూడా పూరీ.. నెత్తిగా(మాటలు సరిగ్గా పలకలేని) మాట్లాడే వ్యక్తిగా చూపించబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. మరి ఏ నేపథ్యంలో సినిమా వస్తుందో..? ఇస్మార్ట్ రేంజ్‌ను విజయ్ అందుకుంటాడో లేడో తెలియాలంటే సినిమా పట్టాలెక్కేవరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.