రిలేషన్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న స్టార్ హీరో

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

త‌ను న‌టించే సినిమాల కోసం స్టార్ హీరోల‌ని సైతం అతిథులుగా ద‌ర్శ‌న‌మ‌య్యేలా చేసుకోవ‌డం ఆ హీరోకి వెన్న‌తో పెట్టిన విద్య‌. అదే త‌ను అతిథి వేషాలు వేయాలంటే మాత్రం.. అది ర‌క్త సంబంధం కి ముడిప‌డి ఉంటేనే త‌ప్ప మ‌రో రూపంలో సాధ్యం కాదు. ఇంత‌కీ ఈ ఫార్ములాని ఫాలో అయ్యే హీరో ఎవ‌రంటే.. విక్ట‌రీ వెంక‌టేష్‌. త‌న కెరీర్ ప్రారంభంలో 'త్రిమూర్తులు' కోసం కృష్ణ‌, శోభ‌న్‌బాబు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి అగ్ర తార‌ల‌ను.. 'చింత‌కాయ‌ల ర‌వి' కోసం ఎన్టీఆర్ వంటి టాప్ హీరోని అతిథి వేషంలో ద‌ర్శ‌న‌మిచ్చేలా చేసుకున్న వెంక‌టేష్‌..

త‌న కెరీర్ మొత్త‌మ్మీద రెండుసార్లు అతిథి వేషాలేసాడు. ప‌దేళ్ల క్రితం త‌న సోద‌రుడు డి.సురేష్‌బాబు నిర్మించిన 'సోగ్గాడు' కోసం ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసిన వెంక‌టేష్‌.. మ‌ళ్లీ త‌న సోద‌రుడి కొడుకు రానా న‌టించిన 'కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్' కోసం ఓ పాట‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి గెస్ట్ రోల్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు వెంకీ. ఈ సారి త‌న సోద‌రి కుమారుడు నాగ‌చైత‌న్య న‌టిస్తున్న 'ప్రేమ‌మ్' కోసం ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తున్నాడని స‌మాచారం. మొత్త‌మ్మీద‌.. బంధుత్వాన్ని దృష్టి పెట్టుకునే అతిథి వేషాలేస్తున్న వెంకీ.. భ‌విష్య‌త్‌లోనూ ఇదే బాట‌లో ప‌య‌నిస్తారో.. లేదంటే ట్రాక్ మారుస్తారో చూడాలి.

More News

నయనతార పైనే ఆశలన్నీ

తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది నయనతార.తని ఒరువన్,మాయ(మయూరి),నానుమ్ రౌడీదాన్ చిత్రాల తో హ్యాట్రిక్ విజయాలు గతేడాది ఆమె సొంతమయ్యాయి.

స‌రైనోడు బ్లాక్ బ‌ష్ట‌ర్ సాంగ్ రిలీజ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

రేవ్ పార్టీతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన న‌వ‌దీప్

యువ హీరో నవదీప్ కి రంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండ‌లం చ‌క్రంప‌ల్లిలో ఫామ్ హౌస్ ఉంది. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి న‌వ‌దీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జ‌రుగుతుంద‌ని..కొంద‌రు సినీ ప్ర‌ముఖులు మ‌ద్యం తాగుతూ డ్యాన్స‌ర్స్ తో హంగామా చేస్తున్న‌ట్టు  పోలీసుల‌కు స‌మాచారం అందింది.

మ‌హేష్ - మురుగుదాస్ విల‌న్ వెన‌క క‌థ‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొంద‌తున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న జూన్ లో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే...ఈ భారీ చిత్రంలో విల‌న్ గా మ‌హేష్ తో సినిమా తీసిన ద‌ర్శ‌కుడు న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి.

వైజాగ్ లో స‌రైనోడు ఫంక్ష‌న్ డేట్ ఫిక్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు.  సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.