పొలిటికల్ ఎంట్రీపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి టైటిల్ చూడగానే టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మలో ఈ యాంగిల్ కూడా ఉందని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ఆర్జీవీ రాజకీయాల్లోకి వస్తారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. రాజకీయాల్లోకి రావాలని తాను అనుకోవట్లేదని వర్మ స్పష్టం చేశారు. అంతటితో ఆగని ఆయన.. ప్రజలకు సేవచేసే ఉద్దేశం తనకు లేదని తేల్చిచెప్పారు.
కాగా.. వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీకి చెందిన నేత అన్న విషయం తెలిసిందే. అయితే ఆయనతో ఆర్జీవీ బాగా కలిసిపోతుండటం.. ఎన్నికల సీజన్ మొదలుకుని ఇప్పటి వరకూ అటు టీడీపీ.. ఇటు జనసేనకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ పోస్ట్లు పెడుతూ పెద్ద ఎత్తునే హడావుడి చేశారు. దీంతో కొంపదీసి ఆర్జీవీ వైసీపీలో చేరిపోయారా ఏంటి..? అని అందరూ ఆయనకు ఫోన్లు, మెసేజ్లు చేశారు. అయితే సోమవారం భీమవరం వేదికగా వర్మ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ పాలిటిక్స్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు.
ఎస్ సినిమా తీస్తున్నా!
"నేను తీసే తదుపరి సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. నా సైకిల్ టైర్ పంచర్ అయింది. అందుకే మేమంతా కారులో వచ్చాం. అత్యంత ఇష్టమైన వ్యక్తి నిజాలు బయటపడతాయని నేను తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆపేసారు. రైతులు కష్టాలు నాకు తెలియదు.. నేను ఎప్పుడూ పొలం వెళ్ళలేదు. ‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు లేకుండా సినిమా తీస్తే ఎవరు చుస్తారు?" అని ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ఆర్జీవీ పై వ్యాఖ్యలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.