వివాదానాకి తెరలేపిన వర్మ...

  • IndiaGlitz, [Tuesday,September 19 2017]

వివాదం లేక‌పోతే వ‌ర్మకు నిద్ర ప‌ట్ట‌దేమో కాబోలు. ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీశాడు. అది కూడా మ‌న మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌పై. గ‌తంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని సినిమా రూపంలో తెర‌కెక్కిస్తాన‌ని తెలిపిన వ‌ర్మ‌. రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో త‌న‌దైన శైళిలో స్పందించాడు. ఎన్టీఆర్‌గారి జీవితంపై రీసెర్చ్ చేసిన త‌ర్వాత త‌న నిర్ణ‌యం మారింద‌ని, తాను తీయ‌బోయే ఎన్టీఆర్ బ‌యోపిక్ ల‌క్ష్మీపార్వ‌తి సైడ్ నుండి ఉంటుందని, కాబ‌ట్టి త‌న సినిమాకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు పెట్టినట్టు తెలిపారు ఆర్‌.జి.వి.

ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్‌ను అర్థం చేసుకున్న తీరును బట్టి చూస్తే ఆ అంశాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు ఎదురైన పరిస్థితులను, ఇతర లోతైన అంశాలతో పాటు, ఎన్టీఆర్‌ నిజ జీవితంలో జరిగిన సంఘటనలను, ఆయన్ని వెన్నుపోటు పొడిచిన వారి గురించి నా చిత్రంలో ప్రస్తావిస్తాన‌ని కూడా చెప్ప‌డం సెన్సేష‌న్స్ క్రియేట్ అవుతున్నాయి. మ‌రి ఇంకా ఎలాంటి దుమారం రేగుతుందో చూడాలి.

More News

జై ల‌వ కుశ‌లో పాత్ర తీరులు ఇవీ..

జై ల‌వ కుశ చిత్రంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూడు పాత్ర‌ల గురించి ఆయ‌న క్లుప్తంగా ఇలా చెప్పుకొచ్చారు.

'గులాబీ మేడ' ఆడియో ఆవిష్కరణ

అల్లు వంశీ,అక్షర జంటగా ఎల్.వి.క్రియేటివ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో

ఆస్ట్రేలియా లో ప్రారంభమైన 'ప్రాజెక్ట్ సి 420'

ఫిలిమ్ అండ్ సి పతాకం పై చైతన్య,దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ దర్శకత్వంలో

'అక్కినేని ఆలోచనలు' పుస్తక అనువాదాల ఆవిష్కరణోత్సవం

మహానటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,

రకుల్ కి ఆ రోజు ప్రత్యేకం

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్