పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడు: రోజా

  • IndiaGlitz, [Sunday,June 28 2020]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం దొరికినప్పుడల్లా నారా లోకేష్‌ని ఏకి పారేసే ఆమె నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ లోకేష్ అని రోజా ఎద్దేవా చేశారు. తిన్నది అరగక పని పాటా లేకుండా లోకేష్ అవాకులు చవాకులు పేలుతున్నాడని ఆమె మండిపడ్డారు. పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడని విమర్శించారు.

కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి.. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని టీడీపీ నేత చంద్రబాబును సైతం జోడించి విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న అవినీతి గద్దలు సాక్ష్యాలతో సహా దొరికి అరెస్ట్‌ అయితే వారిని పరామర్శించేందుకు మాత్రం పరిగెత్తుకొచ్చారని రోజా ఆరోపించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సీఎం జగన్ వంద శాతం పథకాలను అమలు చేశారని రోజా పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా.. క్లిష్టమైన సమయంలో జగన్ ప్రజలను ఆదుకున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఆయన ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రోజా కొనియాడారు.

More News

మహాత్ముని ఫోటో సబబే.. కానీ మిగిలిన నేతలెక్కడ?: నాగబాబు

భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహామహులు ఎందరో ఉన్నారని... వారందరినీ ప్రజలు మరచిపోతున్నారని ముఖ్యంగా పిల్లలకు తెలియటం లేదని మెగా బ్రదర్ నాగబాబు

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. ప్రతి 3 టెస్టులకు ఒక పాజిటివ్

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిన్న నిర్వహించిన టెస్టుల ప్రకారం చూస్తే ప్రతి మూడు టెస్టులకు గాను ఒక పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది.

పలాస దర్శకుడి వెబ్ సిరీస్..!

తొలి చిత్రం ‘ప‌లాస 1978’ సినిమాతో అటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు క‌రుణ కుమార్‌.

మ‌రో హిస్టారిక్ మూవీ ఘాజీ ద‌ర్శ‌కుడు

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు.

టీవీ పరిశ్రమలోని ఆ 33 మంది కరోనా ఫలితం వచ్చేసింది..

లాక్‌డౌన్ అనంతరం ఇటీవలే షూటింగ్‌లకు సిద్ధమైన టీవీ పరిశ్రమకు నటుడు ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో షాక్ తగిలనట్టైంది.