close
Choose your channels

పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడు: రోజా

Sunday, June 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం దొరికినప్పుడల్లా నారా లోకేష్‌ని ఏకి పారేసే ఆమె నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ లోకేష్ అని రోజా ఎద్దేవా చేశారు. తిన్నది అరగక పని పాటా లేకుండా లోకేష్ అవాకులు చవాకులు పేలుతున్నాడని ఆమె మండిపడ్డారు. పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడని విమర్శించారు.

కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి.. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని టీడీపీ నేత చంద్రబాబును సైతం జోడించి విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న అవినీతి గద్దలు సాక్ష్యాలతో సహా దొరికి అరెస్ట్‌ అయితే వారిని పరామర్శించేందుకు మాత్రం పరిగెత్తుకొచ్చారని రోజా ఆరోపించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సీఎం జగన్ వంద శాతం పథకాలను అమలు చేశారని రోజా పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా.. క్లిష్టమైన సమయంలో జగన్ ప్రజలను ఆదుకున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఆయన ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రోజా కొనియాడారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.