‘RRR’ క్లైమాక్స్‌ చిత్రీకరణ అక్కడే!!

  • IndiaGlitz, [Tuesday,December 10 2019]

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘RRR’. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణకు ప్రణాళిక సిద్ధమైంది. వివరాల ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్‌ను వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఇప్పుడు వైజాగ్‌కు ఎన్టీఆర్‌ చేరుకున్నారు. ఎన్టీఆర్‌ వైజాగ్‌లోని ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఆరు రోజుల పాటు ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్‌పై ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. పాడేరు సమీపంలో అటవీ ప్రాంతంతో పాటు కాఫీ తోటల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తారని టాక్‌. ఇప్పటికే రాజమౌళి అండ్‌ టీమ్‌ లొకేషన్‌ను చేరుకుంది.

ఎన్టీఆర్‌ నైజాం పోరాట యోధుడు కొమురం భీమ్‌గా నటిస్తుంటే.. రామ్‌చరణ్‌ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ చరణ్‌ జోడిగా నటిస్తుంది. కాగా బ్రిటన్‌ నటి ఓలివిలియా మోరిస్‌ ఎన్టీఆర్‌ జోడిగా నటిస్తుంది. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌ వంటి హాలీవుడ్‌ తారలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. రూ.400 కోట్లకు పై బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న సినిమా విడుదలవుతుందని సమాచారం.

More News

మహేశ్ ఫ్యాన్స్‌కు రాజేంద్రప్రసాద్ గుడ్‌న్యూస్!

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న హీరోయిన్‌

తెలుగు, తమిళంతో పాటు బెంగాళీ చిత్రాల్లో నటించడమే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్వేతా బసు ప్రసాద్‌.

‘వైఎస్ జగన్ పారిపోయాడు.. నారా లోకేశ్ నిలబడ్డాడు!’

టైటిల్ చూడగానే ఇదేంటబ్బా..? ఏదో లాజిక్ మిస్సయ్యిందే అని అనుకుంటున్నారు కదా.. అదేం లేదండోయ్..

బాబు రౌడీ-ఎమ్మెల్యేలు ఎర్రగడ్డ నుంచి..: రోజా షాకింగ్ కామెంట్స్

వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఎలాంటి వారిపై అయినా విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే.

'దొంగ' ట్రైలర్ రివ్యూ

'ఖైదీ'లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా