రెండో సినిమాకే బాలీవుడ్లో అడుగెట్టేసింది
- IndiaGlitz, [Sunday,June 23 2019]
ఉత్తరాది ముద్దుగుమ్మలు కెరీర్ స్టార్టింగ్లో దక్షిణాదిన హీరోయిన్స్గా ఎంట్రీ ఇస్తారు. సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే కొద్ది మంది భామా మణులు మాత్రమే బాలీవుడ్లో సక్సెస్ అయ్యారు. ఇదే కోవలో ఓ హీరోయిన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమాకే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఇంతకు ఆమె ఎవరో కాదు.. రుహానీ శర్మ.
సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చి.ల.సౌ'. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గత ఏడాది విడుదలై డీసెంట్ విజయాన్ని అందుకుంది. పెర్ఫామెన్స్ పరంగా కూడా రుహానీకి మంచి పేరొచ్చింది. అయితే అవకాశాలు మాత్రం రాలేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ అమ్మడు 'అగ్రా' అనే బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారట. తిత్లీ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కాన్ బెహల్ ఈ చిత్రాన్ని తెరకెక్కింనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది చివరన సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.