రెండో సినిమాకే బాలీవుడ్‌లో అడుగెట్టేసింది

  • IndiaGlitz, [Sunday,June 23 2019]

ఉత్తరాది ముద్దుగుమ్మ‌లు కెరీర్ స్టార్టింగ్‌లో ద‌క్షిణాదిన హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇస్తారు. స‌క్సెస్ అయిన త‌ర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డానికి ఆస‌క్తి చూపుతుంటారు. అయితే కొద్ది మంది భామా మ‌ణులు మాత్ర‌మే బాలీవుడ్‌లో స‌క్సెస్ అయ్యారు. ఇదే కోవ‌లో ఓ హీరోయిన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. రెండో సినిమాకే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైంది. ఇంత‌కు ఆమె ఎవ‌రో కాదు.. రుహానీ శ‌ర్మ‌.

సుశాంత్ హీరోగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'చి.ల‌.సౌ'. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గ‌త ఏడాది విడుద‌లై డీసెంట్ విజ‌యాన్ని అందుకుంది. పెర్ఫామెన్స్ ప‌రంగా కూడా రుహానీకి మంచి పేరొచ్చింది. అయితే అవ‌కాశాలు మాత్రం రాలేదు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు ఈ అమ్మ‌డు 'అగ్రా' అనే బాలీవుడ్ చిత్రంలో న‌టించ‌నున్నార‌ట‌. తిత్లీ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కాన్ బెహ‌ల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కింనున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ ఏడాది చివ‌ర‌న సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు.

More News

‘అమ్మఒడి’ పథకంపై క్లారిటీ.. జగన్ సర్కార్ కీలక ప్రకటన

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల్లో ‘అమ్మఒడి’ పథకం ఒకటి. వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రధానమైనవి నవరత్నాలు మాత్రమే.

నితిన్ - చంద్ర‌శేఖ‌ర్ యేలేటి చిత్రం ప్రారంభం

యూత్ స్టార్ నితిన్ హీరోగా,  అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో, వి.ఆనందప్ర‌సాద్ నిర్మిస్తున్న‌ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు ఆదివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా జ‌రిగాయి.

ఓటు వేయలేకపోయిన ర‌జ‌నీకాంత్

నేడు (ఆదివారం) న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. చెన్నై సెయింట్ ఎబ్బాస్ మెట్రిక్యులేష‌న్ హ‌య్య‌ర్ సెకండ్రీ స్కూల్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 

మరోసారి ‘చోటా’ హాట్ టాపిక్.. నిన్న కాజల్.. నేడు తమన్నా!

టాలీవుడ్‌ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ‘చోటా కె నాయుడు’ ఒకరన్న విషయం తెలిసిందే. అతి తక్కువ కాలంలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెమెరా వర్క్‌కి ఇండస్ట్రీలో

'బన్నీ' బావకు ప్రేమతో నవదీప్ మరిచిపోలేని గిఫ్ట్

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నటుడు నవదీప్‌లు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరి స్నేహం ‘ఆర్య-2’ సినిమాతో మరింత బలపడింది. అంతేకాదు..