షెడ్యూల్ పూర్తి చేసిన సాయిధరమ్ తేజ్

  • IndiaGlitz, [Monday,January 01 2018]

ఖైదీ నెం.150తో తిరిగి స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌. ప్ర‌స్తుతం ఆయ‌న మెగా ఫ్యామిలీ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్నారు. పేరు నిర్ణయించ‌ని ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీకి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా తాలుకూ మ‌స్క‌ట్ షెడ్యూల్ పూర్త‌య్యింద‌ని తెలిసింది. ఇందులో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించార‌ని స‌మాచార‌మ్‌. త్వ‌ర‌లోనే చివ‌రి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకి ఇంటెలిజెంట్‌, ధ‌ర్మాభాయ్ అనే పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. కాగా, కొండ‌వీటి దొంగ‌లోని చ‌మ‌కు చ‌ముకు చామ్ అనే పాట‌ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. చిత్ర యూనిట్ మాత్రం దీని గురించి ఎక్క‌డా స్పందించ‌లేదు.

More News

ప్రభాస్ తదుపరి బాలీవుడ్ సినిమాయే...

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ నేషనల్ రేంజ్ కు పెరిగిపోయింది.

తండ్రైన మంచు విష్ణు

చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం..లెగసీని తీసుకెళ్లడానికి అబ్బాయిలైతే ఏంటి?

మెగా ఫోన్ పట్టనున్న సినిమాటోగ్రాఫర్..

కథారచయితలు..సినిమాటోగ్రాఫర్లు ఈ మధ్య మెగాఫోన్ లు పడుతున్నారు.

రానాతో మెగా హీరో...

విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న యువ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు.

చిరు లుక్ మారిపోయిందే!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌రసింహారెడ్డి ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్ పూర్త‌య్యిందో లేదో కానీ..అప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి మీస‌క‌ట్టుతో ఉన్న లుక్ మార్చేసి సాధార‌ణ లుక్‌లోకి వ‌చ్చేశాడు. దీంతో ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు స్టార్ట్ అయ్యాయి