మరో సినిమాను కూడా లైన్లో పెడుతున్న తేజు
- IndiaGlitz, [Sunday,June 23 2019]
ఆరు ప్లాప్స్ తర్వాత సాయిధరమ్ తేజ్కి దక్కిన హిట్ 'చిత్రలహరి'. కూల్ హిట్ తర్వాత సాయితేజ్ వెంట వెంటనే సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు. కాస్త గ్యాప్ తీసుకున్న సాయితేజ్ త్వరలోనే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు..దీని తర్వాత మరో సినిమాను కూడా సాయితేజ్ లైన్లో పెట్టుకుంటున్నాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం సాయితేజ్ తదుపరి సినిమాను దేవా కట్టా డైరెక్షన్లో చేయబోతున్నాడట.
దేవా కట్టా ప్రస్తుతం 'బాహుబలి' ప్రీక్వెల్గా రూపొందుతున్న వెబ్ సిరీస్ 'శివగామి'ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాతే సాయితేజ్తో దేవాకట్టా సినిమా ఉంటుంది. సోషల్ డ్రామా నేపథ్యంలో దేవాకట్టా సినిమా ఉంటుందంటున్నారు. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య చిత్రాల దర్శకుడు దేవాకట్టా ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారట.