ఇంట్రస్టింగ్.. బాలయ్యకు కూతురిగా సాయిపల్లవి!

  • IndiaGlitz, [Friday,March 19 2021]

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇలా కొందరు సీనియర్ హీరోలు వయసు 60 దాటుతున్నా.. పక్కన యంగ్ హీరోయిన్స్‌తో హీరోగా నటించేందుకే ఇప్పటి వరకూ ఆసక్తి చూపారు. అలా కాదు.. ఓ హీరోయిన్‌కు తండ్రి పాత్ర అంటే ఒప్పుకుంటారా? అంటే సందేహమే. కానీ బాలయ్య మాత్రం ఓకే చెప్పేశారట. అది కూడా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవికి తండ్రికి నటించేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇప్పటి వరకూ విక్టరీ వెంకటేష్ మాత్రమే ఈ తరహా పాత్రలో నటించారు. ఇప్పుడు ఆయన సరసన బాలయ్య కూడా చేరబోతున్నారు.

ఈ వార్త గత రెండు మూడు రోజులుగా ప్రముఖ వెబ్‌సైట్లలో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా చాలా ఆసక్తికర వార్త కావడంతో నెటిజన్లు కూడా దీనిపై దృష్టి సారిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే..నందమూరి బాలకృష్ణ.. ఆయన స్టైలే వేరు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఒకట్రెండు జోనర్‌లకు మాత్రమే పరిమితమయ్యారు. తాజాగా ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా చేయబోతున్నట్టు టాక్. తాజాగా ఆయనను ఓ యంగ్ డైరెక్టర్ ఓ షూటింగ్‌లో కలిశారట. సింపుల్ అండ్ స్వీట్‌గా తన దగ్గరున్న కథ గురించి నెరేషన్ ఇచ్చారట. కథ విన్న వెంటనే హ్యాపీ ఫీలైన బాలయ్య.. క్షణం కూడా లేటు చేయక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇక బాలయ్యకు కూతురిగా సాయి పల్లవిని దర్శకుడు అనుకుంటున్నారట. ముఖ్యంగా కథ మొత్తం కుమార్తె చుట్టూ తిరుగుతుందట. సింపుల్‌గా చెప్పాలంటే ‘దృశ్యం’ సినిమా స్టైయిల్‌లో ఉంటుందట. తండ్రిని కాపాడటం కోసం కుమార్తె పోరాడే కథట. ఈ కథకు సాయిపల్లవి అయితే సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్ భావిస్తున్నారట. ప్రస్తుతం సాయిపల్లవి బిజీగా ఉండటంతో కథ వినేందుకు కాస్త సమయం కోరిందట. కథంతా విన్నాక సాయిపల్లవి ఓకే అంటే.. ఇక కుమార్తె కూడా సెట్ అయిపోయినట్లే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని యంగ్ డైరెక్టర్ భావిస్తున్నారట. మరి సాయిపల్లవి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

More News

రైస్ పుల్లింగ్ పేరుతో రూ.26 కోట్లకు ముంచేసిన జయచిత్ర కుమారుడు

సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, యువ సంగీత దర్శకుడు అమ్రేష్ ఒక వ్యక్తిని రూ.26 కోట్లకు ముంచేశాడు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలో ఉన్న రైస్ పుల్లింగ్ ఎపిసోడ్‌ని ఆధారంగా చేసుకున్నాడో..

'వకీల్ సాబ్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్‌...?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు

'విరాటపర్వం' టీజర్ : గూస్‌బంప్స్ ఖాయం

వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో నేషనల్ స్టార్ రానా దగ్గుబాటి, సెన్సేషనల్‌ బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. ‘రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్’

రైతుగా మారిన రష్మిక మందన్న

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్న‌.. ఇప్పుడు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ స్పీడు పెంచుతోంది. వరుస సినిమాలు చేస్తూ అందిరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌

ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. తాజాగా క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.