శర్వానంద్ తో సాయిపల్లవి?

  • IndiaGlitz, [Thursday,November 16 2017]

మ‌హానుభావుడుతో రీసెంట్ గా త‌న ఖాతాలో మ‌రో విజ‌యాన్ని వేసుకున్నారు యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు శ‌ర్వానంద్‌. ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో పాటే మ‌రో సినిమా చేసేందుకు శ‌ర్వా ప్లాన్‌ చేస్తున్నార‌ని స‌మాచార‌మ్‌.

అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాధ‌, లై చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమాలో సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంచుకున్న‌ట్లు తెలిసింది.

ఫిదాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన సాయి ప‌ల్ల‌వి.. ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నానికి జోడీగా ఎం.సి.ఎ చేస్తోంది. దీంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం క‌ణంలోనూ నాగ‌శౌర్య‌కి జోడీగా న‌టిస్తోంది. ఇందులో 4 ఏళ్ల పాప‌కి త‌ల్లి పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌నుంది. అలాగే ధ‌నుష్ హీరోగా రూపొందుతున్న ద్విభాషా చిత్రంలోనూ సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా ఎంపికైంది.

More News

వచ్చే ఏడాది రూట్ మారుస్తున్న నితిన్

గత మూడేళ్లుగా ఏడాదికో సినిమాతో పలకరిస్తూ ఉన్నాడు యువ కథానాయకుడు నితిన్. 2015లో కొరియర్ బోయ్ కళ్యాణ్ తో పలకరించిన నితిన్.. గతేడాది సంచలన విజయం సాధించిన అఆతో పలకరించారు. ఇక ఈ సంవత్సరం లైతో సందడి చేశారు.

శ్రియతో కెమిస్ట్రీ బావుందట

పదహారేళ్లుగా కథానాయికగా అలరిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్. ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో వశిష్టి దేవీ పాత్రలో అలరించిన శ్రియ.. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉంది.

నయనతార హిట్ చిత్రం.. రీమేక్ గా?

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన కేరళకుట్టి నయనతార.. తాజాగా మరో విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్తో పలకరించింది. ఆ చిత్రమే అరమ్. గత శుక్రవారం విడుదలైన ఈ తమిళ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

గ్రాండ్ రిలీజ్కి సిద్ధమైన కార్తి

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఖాకి' నవంబర్ 17న విడుదలకు సిద్ధమైంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ నుండి విడుదల వరకు హ్యూజ్ రెస్పాన్స్ను రాబట్టుకున్న ఈ చిత్రం తమిళం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్లో విడుదల కానుంది.

ముఖ్య‌మంత్రిని ప్ర‌శ్నించిన గుణ‌శేఖ‌ర్‌...

2015లో చారిత్రాత్మ‌క చిత్రం 'రుద్ర‌మ‌దేవి'ని నిర్మించి, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌కు నంది అవార్డుల విష‌యంలో వ‌చ్చిన ఫ‌లితం నిరాశ క‌లిగించింది. నిజానికి ఆ సినిమాకు వినోద‌పు ప‌న్ను మిన‌హాయించాల‌ని గుణ‌శేఖ‌ర్ అప్ప‌ట్లో ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని కోరారు.