close
Choose your channels

వచ్చే ఏడాది రూట్ మారుస్తున్న నితిన్

Thursday, November 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌త మూడేళ్లుగా ఏడాదికో సినిమాతో ప‌ల‌కరిస్తూ ఉన్నాడు యువ క‌థానాయ‌కుడు నితిన్‌. 2015లో కొరియ‌ర్ బోయ్ క‌ళ్యాణ్ తో ప‌ల‌క‌రించిన నితిన్‌.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన అఆతో ప‌ల‌క‌రించారు. ఇక ఈ సంవ‌త్స‌రం లైతో సంద‌డి చేశారు.

అయితే వ‌చ్చే ఏడాది మాత్రం రెండు సినిమాల‌తో ప‌ల‌క‌రించేందుకు నితిన్ ప్లాన్ చేసుకున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రాన్ని కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు నితిన్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌రువాత దిల్ రాజు నిర్మించ‌నున్న శ్రీ‌నివాస క‌ళ్యాణంలో న‌టించేందుకు నితిన్ తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. శ‌త‌మానం భ‌వ‌తితో ఘ‌న‌విజ‌యం అందుకున్న స‌తీష్ వేగేశ్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ సినిమా కూడా వ‌చ్చే ఏడాది సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

అంటే.. నితిన్ వ‌చ్చే ఏడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.