కిందపడేసేలోపు మూడుసార్లు కరిచింది.. పాముకాటుపై స్పందించిన సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కరిచిన వార్తతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో సల్మాన్‌ను ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్‌ను విషం లేని పాము కాటేసినట్లగా నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఎంజీఎం (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఆదివారం ఉదయం 9 గంటలకు తన ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు సల్లూభాయ్. తన తండ్రితో కలిసి సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఒక పాము నా ఫామ్‌హౌస్‌లోకి వచ్చింది... ఒక కట్టెతో దాన్ని అవతలకు విసిరేయాలనుకున్నా అని సల్మాన్ చెప్పారు. కానీ అది వెంటనే తన చేతిపైకి పాకిందని... దాన్ని కిందపడేసేలోపే మూడుసార్లు కాటేసిందని ఆయన పేర్కొన్నారు. అది విషపూరితమైన పాము అనిపించిందని.. ఆసుపత్రిలో ఆరు గంటలు ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యానని సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే వుందని ఆయన వెల్లడించారు.

సల్మాన్‌ తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకిని పాము కరిచిందన్న విషయం తెలియగానే ఎంతగానో భయపడిపోయామని చెప్పారు. కానీ అది మరీ విషసర్పం కాకపోవడంతో త్వరగానే కోలుకున్నాడని ఆయన తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. భయపడాల్సిన పనేమీ లేదు అని వెల్లడించారు. ఇక సల్మాన్ ఖాన్ ఈరోజు 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. త్వరలో ఆయన తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి న‌టిస్తోన్న గాడ్ ఫాద‌ర్‌ మూవీ ద్వారా టాలీవుడ్‌‌లో అడుగుపెడుతున్నారు సల్మాన్‌. అలాగే విక్టరీ వెంక‌టేశ్‌తో కూడా సినిమా చేయ‌బోతున్నాడని ఫిలింనగర్ టాక్.

More News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం... ప్రముఖ సింగర్ కన్నుమూత

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పలువురు ప్రముఖులు కన్నుమూశారు.

‘‘రాధేశ్యామ్’’ కోసం తమన్‌ను దించిన యూవీ క్రియేషన్స్.. బీజియమ్ అదిరిపోవాలంతే...!!

ఈ మధ్యకాలంలో తమన్ సాంగ్స్, బీజియమ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి పేరొస్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో థియేటర్ల పరిస్ధితిపై నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు... ట్రైయిన్ టికెట్స్‌తో పోలుస్తూ పోస్ట్

సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.

ఒకరిద్దరు హీరోలపై కక్ష.. మొత్తం సినీ పరిశ్రమనే నాశనం చేస్తారా: జగన్‌పై సోమిరెడ్డి ఆగ్రహం

ఏపీలో సినిమా  టికెట్ ధరల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ వర్గాలు మాత్రమే దీనిపై స్పందించగా..

నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం పోస్టర్ విడుదల

నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్'  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది.