స‌మంత‌.. మిలియ‌న్ డాల‌ర్ క్వీన్‌

  • IndiaGlitz, [Wednesday,April 04 2018]

అదృష్టం అనే మాట‌కి ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచిన క‌థానాయిక స‌మంత‌. కెరీర్‌లో సింహ‌భాగం విజ‌యాల‌ను చ‌విచూసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఓ విష‌యంలో త‌న తోటి క‌థానాయిక‌లకుఎవ‌రికి సొంతం కాని రికార్డు కైవ‌సం చేసుకుంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే..  యు.ఎస్ క‌లెక్ష‌న్ల ప‌రంగా  మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ అనేది ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం అనేది తెలిసిందే. ఈ లిస్ట్‌లో చేరిన తొలి టాలీవుడ్ మూవీగా నిలిచింది.. 2011లో విడుద‌లైన 'దూకుడు' చిత్రం. మ‌హేశ్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. 'దూకుడు' మొద‌లు.. ప్ర‌తి ఏడాది త‌న ఖాతాలో ఓ మిలియ‌న్ డాల‌ర్ మూవీని న‌మోదు చేసుకుంటోంది స‌మంత‌.

అలా.. తాజాగా రిలీజైన 'రంగ‌స్థ‌లం'తో ఇప్ప‌టివ‌ర‌కు ఏ ద‌క్షిణాది క‌థానాయికకు సొంతం కాని రికార్డుని సొంతం చేసుకున్న‌ట్ల‌య్యింది. దూకుడు (2011), ఈగ‌ (2012), సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, అత్తారింటికి దారేది (2013), మ‌నం (2014), స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి(2015), తెరి (త‌మిళ్‌), 24, బ్ర‌హ్మోత్స‌వం, జ‌న‌తా గ్యారేజ్‌ (2016), మెర్స‌ల్ (త‌మిళ్‌) (2017).. తాజాగా 'రంగ‌స్థ‌లం' (2018).. ఇలా 13 చిత్రాల‌తో మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో క్వీన్‌గా నిలిచిపోయింది స‌మంత‌. మున్ముందు కూడా ఈ ప‌రంప‌ర కొన‌సాగిస్తుందేమో చూడాలి.

More News

వ‌రుణ్ తేజ్, సంక‌ల్ప్ రెడ్డి మూవీ అప్‌డేట్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న‌ విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్ మూవీగా #RRR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కులుగా దర్శకధీరుడు రాజమౌళి  ఓ మల్టీస్టారర్ మూవీని  తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

జెన్నీఫ‌ర్ లోపెజ్ భ‌వంతిలో రవితేజ చిత్రం

మాస్ మహారాజా రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.

'రంగ‌స్థ‌లం' న‌టుడిగా బాధ్యత‌ను పెంచింది: న‌టుడు ఆది పినిశెట్టి

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'రంగ‌స్థ‌లం' ఇటీవ‌ల విడుదలై భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.

రూమ‌ర్స్‌ను కొట్టి పారేసిన వర్మ‌... 

శివ‌, గోవిందా గోవింద‌, అంతం చిత్రాల త‌ర్వాత అక్కినేని నాగార్జున‌, రామ్ గోపాల్ కాంబినేష‌న్‌లో