స‌మంత 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన వ‌న్ అండ్ ఓన్టీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్.

ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ వంటి నాటి అగ్ర క‌థానాయ‌కుల నుండి నేటి కుర్ర స్టార్స్ వ‌ర‌కు సినిమాల‌ను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఈ ఏడాదితో 55 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తున్న 'ఓ బేబి' సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోస్తూ సినిమా స‌క్సెస్‌లో కీల‌క భూమిక పోషిస్తున్న అగ్ర క‌థానాయిక స‌మంత అక్కినేని. ఓ బేబి చిత్రంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించారు. ఈమెతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా కీల‌క పాత్ర‌లో న‌టించారు. 'ఓబేబి' ఫ‌స్ట్ లుక్‌లో స‌మంతతో పాటు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని బి.వి.నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్సాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

శిరీష్‌కు అంత న‌మ్మ‌క‌మేంటో..?

అల్లు శిరీష్ 'గౌర‌వం' సినిమాతో హీరోగా ప‌రిచయం అయ్యాడు. 'కొత్త‌జంట‌', 'శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు', 'ఒక్క‌క్ష‌ణం' సినిమాలు కాస్త మంచి పేరునే తెచ్చిపెట్టాయి. తాజాగా విడుద‌లైన ఏబీసీడీ`పై శిరీష్

శ్రీహ‌రి కుమారుడి తొలి సినిమా

చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి స్టార్ న‌టుడిగా, హీరోగా పేరు సంపాదించుకున్నాడు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి. 2013లో శ్రీహ‌రి అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

'సాహో' సర్‌ఫ్రైజ్ పోస్టర్‌‌ పై అనుష్క కామెంట్..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్

ఫలితాలకు ముందు ఎమ్మెల్యే దారుణ హత్య...

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను గురువారం ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

జగన్‌ ఫేస్‌బుక్ పోస్టుతో సీఎం ఎవరో తేలిపోయింది!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కౌన్‌డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఏపీ సీఎం ఎవరో.. ప్రతిపక్షనేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు