'సమ్మోహనం' ఆ సినిమాకి స్ఫూర్తినా?

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

యువ కథానాయకుడు సుధీర్ బాబు, బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరి జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోందీ చిత్రం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి  టీజర్‌ను ఆవిష్కరించడ‌మే కాకుండా.. స‌ద‌రు టీజ‌ర్‌పై ప్రశంసల జల్లు కురిపించడంతో ఈ సినిమాకి చెప్పుకోద‌గ్గ హైప్ వచ్చింది.

అయితే.. ఈ సినిమా టీజ‌ర్‌ చూసిన వాళ్ళు మాత్రం దీన్ని ఓ బ్రిటిష్ ఫిల్మ్‌తో పోల్చి చూస్తున్నారు. కాస్త  వివరాల్లోకి వెళితే.. 1999లో రోజర్ మిచెల్ డైరెక్షన్లో జూలియా రోబెర్ట్స్, హ్యూ గ్రాంట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రిటిష్ ఫిల్మ్ ‘నోట్టింగ్ హిల్’. రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకున్న ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఆధారంగానే స‌మ్మోహ‌నం రూపొందింద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. ఈ విషయాన్ని హీరో సుధీర్ బాబు కొట్టి పడేస్తున్నారు. దర్శకుడు ఇంద్రగంటి ‘గోల్కొండ హై స్కూల్’ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నారనీ.. అది ఇప్పుడు తెరకెక్కించారని ఆయ‌న చెబుతున్నారు. అయితే.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. జూన్ 14వరకు వేచి ఉండాల్సిందే.

More News

భారీ యాక్ష‌న్ సీన్ పూర్తిచేసిన చ‌ర‌ణ్‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

న్యూయార్క్‌, క‌ర్నూల్ నేప‌థ్యంలో మ‌హేష్ 25వ చిత్రం

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిల్మ్‌ను హ్యాట్రిక్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

రానాతో రూ.50 కోట్ల బ‌డ్జెట్‌తో..

క‌థానాయ‌కుడిగానూ, ప్ర‌తినాయ‌కుడిగానూ మెప్పించిన యువ న‌టుడు రానా.

ఒక పాట మిన‌హా పూర్త‌యిన సుమంత్ చిత్రం

మ‌ళ్ళీ రావా చిత్రంతో చాలా కాలం త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు క‌థానాయ‌కుడు సుమంత్‌.

ఆ మ్యాజిక్ మ‌రోసారి రిపీట్ అవుతుందా?

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్.. ఎన్నో విజ‌యవంత‌మైన సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాణ సంస్థ పేరిది.