వి.బి.రాజేంద్రప్రసాద్ కు పూజా సంకీర్తనలు అంకితం

  • IndiaGlitz, [Tuesday,January 12 2016]

పూజా సంకీర్తనల పేరిట ఇప్పటికే నాలుగు ఆల్బంలను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ ప్రధమ వర్ధంతి సందర్భంగా భక్తి పాటలకు సంబంధించిన ఈ పూజా సంకీర్తనల ఐదవ ఆల్బంను అంకితం చేశారు. నటుడు మురళీమోహన్ ఈ సంకీర్తనల ఆల్బం ను విడుదల చేసి జగపతి బాబు కి అందించారు. ఈ సందర్భంగా..

మురళీమోహన్ మాట్లాడుతూ.. ''జగపతి సంస్థ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించింది. ముఖ్యంగా ఆ సంస్థ నుండి వచ్చే ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచేది. రాజేంద్ర ప్రసాద్ గారు సంగీత దర్శకులతో, పాటల రచయితలతో ప్రత్యేకంగా కొంత సమయం ఉండేవారు. సంగీతమంటే ఆయనకు ఎంతో అభిమానం ఉంది. అలాంటి కుటుంబం నుండి పూజా సింగర్ గా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. నా మనువరాలు పూజా చక్కగా పాడుతుందని చెప్పి రాజేంద్రప్రసాద్ గారు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. పూజా సంకీర్తనలు నాలుగు ఆల్బంలను ఆయనే దగ్గరుండి రిలీజ్ చేశారు. ఈ డివోషనల్ సాంగ్స్ లో హిందీ, గుజరాతి బజన్స్ కుడా ఉన్నాయి. కేవలం భక్తి పాటలకే తన పూజా తన గొంతునిస్తుంది. ఈ ఆల్బం ను పూజా తన తాతగారికి అంకితం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ బంటి మాట్లాడుతూ.. ''రాజేంద్రప్రసాద్ గారు ఎంతో ఎఫక్షనేట్ గా ఉండేవారు. పూజా ప్రతి పాటా చాలా బాగా పాడింది. మంచి మెలోడియస్ వాయిస్ తనది'' అని చెప్పారు.

జగపతిబాబు మాట్లాడుతూ.. ''నాన్నగారు బ్రతికున్నంత వరకు దసరా బుల్లోడు లా బ్రతికారు. చాలా ఎంజాయ్ చేసేవారు. పూజా చనిపోయిన వాళ్ళ తాతగారికి మంచి గిఫ్ట్ ఇచ్చింది. తను మల్టీ టాలెంటెడ్ పెర్సన్. బంటీ అండ్ టీం ఎక్సలెంట్ జాబ్ చేశారు. నాగేశ్వరావు గారు, నాయుడు గారు, నాన్నగారు అందరూ పైనే ఉన్నారు. నాకు తెలిసి వారంతా అక్కడ స్వర్గం అనే సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు'' అని చెప్పారు.

More News

నాన్నకు ప్రేమతో...దేవిశ్రీ ప్రత్యేక గీతం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో...

'నాన్నకు ప్రేమతో..'సినిమాలో తారక్ ను తప్ప ఇంకేవరినీ ఉహించుకోలేను : - సుకుమార్

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది.

బాబాయ్ డైరెక్ట‌ర్ తో అబ్బాయ్ మూవీ..

బాబాయ్ డైరెక్ట‌ర్ తో అబ్బాయ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇంత‌కీ బాబాయ్ - అబ్బాయ్ ఎవ‌ర‌నుకుంటున్నారా..?

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజు గారింట్లో 7వ రోజు'

అజయ్,భరత్,అర్జున్,వెంకటేష్,సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మించిన సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'.

సూపర్ స్టార్ మూవీకి ప్రిన్స్ ప్రచారం..

దాదాపు 350 సినిమాల్లో నటించినా...హీరోగా యాభై ఏళ్లు పూర్తైనా...తనయుడు మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగినా...ఇంకా నటించడానికి రెడీ అంటున్నారు సూపర్ స్టార్ క్రిష్ణ.