శ‌ర్వానంద్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ న‌టి

  • IndiaGlitz, [Friday,March 09 2018]

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన 'విజయ' (త‌మిళంలో వ‌ల్లి) (1993)చిత్రంతో క‌థానాయిక‌గా పరిచయమయ్యారు ప్రియా రామన్. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'శుభ సంకల్పం' (1995), శోభన్ బాబు సరసన 'దొరబాబు' (1995) చిత్రాల్లో నటించారు. అర్జున్ నటించిన 'మావూరి మారాజు' (1995) సినిమాలోనూ న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌తో మెప్పించారు.

అలాగే బాలకృష్ణ న‌టించిన‌ పౌరాణిక చిత్రం 'శ్రీ కృష్ణార్జున విజయం' (1996)లో రుక్మిణిగా ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు దూర‌మ‌య్యారు ప్రియా రామ‌న్‌. పెళ్లి చేసుకుని సినిమాలకు చాలా కాలం క్రిత‌మే గుడ్ బై చెప్పిన ఈ సీనియర్ నటి.. త‌మిళ్‌, మ‌ల‌యాళం సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచె మనసు' చిత్రంతో ఆమె మళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో శర్వానంద్‌కు తల్లిగా క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో ప్రియా రామన్ క‌నిపించ‌నున్నారని తెలిసింది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కలకత్తాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

More News

'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు.

రామ్ సినిమా తోనూ కొన‌సాగించిన ద‌ర్శ‌కుడు

గ‌తేడాది విడుద‌లైన 'నేను లోకల్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నిఖిల్ రెండు చిత్రాలు అలాగే..

యువ క‌థానాయకుడు నిఖిల్ గ‌త రెండేళ్ళుగా ఏడాదికో సినిమాతో సంద‌డి చేసారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విశేష‌మేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలు కావ‌డం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 16న నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' విడుద‌ల కానుంది.

'కొండవీటి దొంగ' కు 28 ఏళ్ళు

''ఉన్నవాడిని కొల్లగొట్టి లేనివాడికి పెట్టు" అనే రాబిన్ హుడ్ సిద్ధాంతంతో తెరకెక్కిన చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచిన హిట్ మూవీ ఇది.

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: శ్రీకాంత్

ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం  కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది..  గాసిప్స్  అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లే