close
Choose your channels

శ‌ర్వానంద్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ న‌టి

Friday, March 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన 'విజయ' (త‌మిళంలో వ‌ల్లి) (1993)చిత్రంతో క‌థానాయిక‌గా పరిచయమయ్యారు ప్రియా రామన్. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'శుభ సంకల్పం' (1995), శోభన్ బాబు సరసన 'దొరబాబు' (1995) చిత్రాల్లో నటించారు. అర్జున్ నటించిన 'మావూరి మారాజు' (1995) సినిమాలోనూ న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌తో మెప్పించారు.

అలాగే బాలకృష్ణ న‌టించిన‌ పౌరాణిక చిత్రం 'శ్రీ కృష్ణార్జున విజయం' (1996)లో రుక్మిణిగా ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు దూర‌మ‌య్యారు ప్రియా రామ‌న్‌. పెళ్లి చేసుకుని సినిమాలకు చాలా కాలం క్రిత‌మే గుడ్ బై చెప్పిన ఈ సీనియర్ నటి.. త‌మిళ్‌, మ‌ల‌యాళం సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచె మనసు' చిత్రంతో ఆమె మళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో శర్వానంద్‌కు తల్లిగా క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో ప్రియా రామన్ క‌నిపించ‌నున్నారని తెలిసింది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కలకత్తాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.