అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీందర్ రెడ్డి ఇక లేరు..!

  • IndiaGlitz, [Saturday,August 25 2018]

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీంద‌ర్ రెడ్డి ఈరోజు మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈరోజు త‌న సోద‌రి ఇంట్లో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌నకు చిన్న‌ప్ప‌టి నుంచి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అభిమాని. ప్రేమాభిషేకం సినిమా అప్ప‌టి నుంచి అక్కినేని అభిమానులంద‌రినీ క‌లుపుకుని ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసారు.

నాగార్జున విక్ర‌మ్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన‌ప్పుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు ర‌వీంద‌ర్ రెడ్డిని పిలిచి నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నియ‌మించారు. అప్ప‌టి నుంచి నాగార్జున‌తో ర‌వీంద‌ర్ రెడ్డికి అనుబంధం ఏర్ప‌డింది. ర‌వీంద‌ర్ రెడ్డి పెళ్లికి నాగార్జున వెళ్లి ఆశీర్వ‌దించారు.అక్కినేని, నాగార్జున పేరు మీద ఎన్నో సేవా కార్య‌క్రమాలు చేసారు. అభిమానులంద‌రికీ అందుబాటులో ఉంటూ స‌హాయ స‌హ‌కారాలు అందించేవారు.

గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న‌ క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. త‌న తోటి అభిమానుల‌కు ఈ విష‌యం తెలిస్తే..బాధ‌ప‌డ‌తారు. చూడ‌డానికి త‌న ఇంటికి వ‌చ్చేస్తార‌నే ఉద్దేశ్యంతో గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న హైద‌రాబాద్ లోని త‌న సోద‌రి ఇంట్లోనే ఉన్నారు. ఈ రోజు సోద‌రి ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణం అక్కినేని అభిమానుల‌కు తీర‌నిలోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తూ సంతాపం తెలియ‌చేస్తున్నాం.

More News

నర్తన శాల నచ్చకపోతే చూడొద్దు . నచ్చితే పది మందికి చెప్పండి - హీరో నాగశౌర్య

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల.

భోజ్‌పురి మూవీని డైరెక్ట్ చేయ‌నున్న కోన వెంక‌ట్

రైట‌ర్‌.. నిర్మాత కోన వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా మారుతున్నారు. ఏక కాలంలో రెండు ప్రాజెక్టుల‌ను కోన వెంక‌ట్ అనౌన్స్ చేశారు.

అనుష్క 'సైలెంట్‌'

బాహుబ‌లి, భాగ‌మ‌తి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్న అనుష్క శెట్టి .. త‌దుప‌రి చాలా గ్యాప్ తీసుకుంది. తాజాగా ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో 'సైలెంట్' అనే చిత్రం రూపొంద‌నుంది.

బాలీవుడ్‌లోకి మ‌రో సౌత్ మూవీ...

బాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా ఇటు మేకింగ్‌లో.. కాన్సెప్ట్ ప‌రంగా సౌత్ సినిమాలు వ‌స్తున్నాయి. దీంతో బాలీవుడ్ మేక‌ర్స్ ద‌క్షిణాది సినిమాల‌పై ఆస‌క్తిని చూపుతున్నారు.

అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ...?

అఖిల్‌, హ‌లో చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.