close
Choose your channels

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీందర్ రెడ్డి ఇక లేరు..!

Saturday, August 25, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీంద‌ర్ రెడ్డి ఈరోజు మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈరోజు త‌న సోద‌రి ఇంట్లో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌నకు చిన్న‌ప్ప‌టి నుంచి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అభిమాని. ప్రేమాభిషేకం సినిమా అప్ప‌టి నుంచి అక్కినేని అభిమానులంద‌రినీ క‌లుపుకుని ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసారు.

నాగార్జున విక్ర‌మ్ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన‌ప్పుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు ర‌వీంద‌ర్ రెడ్డిని పిలిచి నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా నియ‌మించారు. అప్ప‌టి నుంచి నాగార్జున‌తో ర‌వీంద‌ర్ రెడ్డికి అనుబంధం ఏర్ప‌డింది. ర‌వీంద‌ర్ రెడ్డి పెళ్లికి నాగార్జున వెళ్లి ఆశీర్వ‌దించారు.అక్కినేని, నాగార్జున పేరు మీద ఎన్నో సేవా కార్య‌క్రమాలు చేసారు. అభిమానులంద‌రికీ అందుబాటులో ఉంటూ స‌హాయ స‌హ‌కారాలు అందించేవారు.

గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న‌ క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. త‌న తోటి అభిమానుల‌కు ఈ విష‌యం తెలిస్తే..బాధ‌ప‌డ‌తారు. చూడ‌డానికి త‌న ఇంటికి వ‌చ్చేస్తార‌నే ఉద్దేశ్యంతో గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న హైద‌రాబాద్ లోని త‌న సోద‌రి ఇంట్లోనే ఉన్నారు. ఈ రోజు సోద‌రి ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణం అక్కినేని అభిమానుల‌కు తీర‌నిలోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తూ సంతాపం తెలియ‌చేస్తున్నాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.