ప్రముఖ సినీ జర్నలిస్ట్ పసుపులేటి ఇకలేరు..

  • IndiaGlitz, [Tuesday,February 11 2020]

ప్రముఖ సినీ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురైన ఆయన్ను ఆదివారం నాడు వనస్థలిపురంలోని మెడిసిన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్‌లోని ఆయన స్వగృహానికి తీసుకొస్తున్నారు. ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పనిచేశారు. అనేక సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు.

చిరుతో మంచి సాన్నిహిత్యం!

అంతేకాదు.. విశాలాంధ్ర పత్రికతో పాటు పలు పత్రికలకు జర్నలిస్ట్‌గా పనిచేశారు. ప్రస్తుతం ‘సంతోషం’ సినీ పత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాగా.. పసుపులేటికి మెగాస్టార్ చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో చిరునే ఆయన హెల్త్ టెస్ట్‌లు కూడా చేయించారని చెబుతుంటారు. అయితే చిరు ఒక్కరితోనే కాదు ఇండస్ట్రీలో సీనియర్ నటీనటులతో రామారావుకు మంచి పరిచయాలున్నాయి. పసుపులేటి ఇకలేరన్న విషయం తెలుసుకున్న నటీనటులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు.. కుటుంబ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇప్పుడుడిప్పుడే ప్రముఖులు పసుపులేటి ఇంటికి చేరుకుంటున్నారు.

రామారావు గురించి మూడు ముక్కల్లో..!

పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. డిగ్రీ చదివిన ఆయన ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా పనిచేసారు. పసుపులేటి ఎన్టీఆర్‌, ఏఎన్నార్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు.. ఆ తర్వాత తరం చంద్రమొహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. అలాగే ఇప్పటి తరం హీరోలతోను, హీరోయిన్లతో, పెద్ద, చిన్న నిర్మాతలతోను, 24 భాగాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులతోను ఇంటర్య్వులు తీసుకున్నారు. అంతేకాదు.. ఆ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘నాటి మేటి సినీ ఆణిముత్యాలు’ అనే పేరుతో పుస్తకరూపంలో కూడా తీసుకువచ్చారు. దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ రావు జీవితంపై పసుపులేటి ‘తెరవెనుక దాసరి’ అనే పుస్తకాన్ని రాశారు.

More News

12న కర్నూలు, 15న రాజధానిలో పవన్ పర్యటన

టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు సినిమాలు.. అటు రాజకీయాలతో బిజిబిజీగా గడుపుతున్నారు.

రాపాకను రప్ఫాడేస్తున్న జన సైనిక్స్.. అసలేం జరిగింది!

2019 ఎన్నికల్లో జనసేన తరఫున వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్న నటీమణులు.. ఎందుకిలా!?

సోషల్ మీడియా వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది.. రోజురోజుకూ దీని గురించి తెలియని వారు కూడా తెలుసుకుని సోషల్ రంగంలోకి దిగుతున్నారు.

సరికొత్త లుక్‌లో రానా.. సిద్ధమవుతోన్న త్రిభాషా చిత్రం

దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌.. వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్‌ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది.

సినీ పోలీస్ మాల్ లో శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ !

శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ పోలీస్ మాల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు రచయిత చిన్న కృష్ణ పాల్గొన్నారు.