close
Choose your channels

ఆ ఉద్దేశంతోనే పుట్టినరోజు నాడు ఆలయ మర్యాదలు కోరాం: శారదాపీఠం

Tuesday, November 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ ఉద్దేశంతోనే పుట్టినరోజు నాడు ఆలయ మర్యాదలు కోరాం: శారదాపీఠం

‘‘నాగుల చవితి పవిత్ర దినమున, అనగా ఈనెల 18వ తేదీన శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవం నిర్వహిస్తున్నాం. కావున, తమ ఆలయ అధికారిక సిబ్బంది, ప్రధాన అర్చకులు, పండితుల ద్వారా ఈ క్రింద తెలియచేసిన ఆలయ మర్యాదలను అందించాల్సిందిగా కోరుతున్నాము’’ అంటూ ఒక విచిత్రమైన లేఖ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పీఠం మేనేజర్‌ నుంచి ఈనెల 9వ తేదీన ఏపీ దేవదాయ శాఖ కమిషనర్‌కు అందిన విషయం తెలిసిందే. అంతేకాదు... ఆ 23 ఆలయాల పేర్లను సైతం వెల్లడించింది. ఆ తరువాత వెంటనే ఆఘమేఘాల మీద దేవాదాయ శాఖ.. అర్చకులు, అధికారులతో సహా వచ్చి స్వరూపానందకు ప్రసాదాలు, ఆలయ స్థాయికి తగిన మర్యాదతో కానుకలు సమర్పించుకుని వెళ్లాలని 23 ప్రముఖ ఆలయాలకు ఆదేశాలు జారీ చేసింది.

స్వామిజీ అలా కోరడమే జనాలకు పెద్ద వింతైతే.. స్వామిజీ కోరిన 23 ప్రముఖ దేవాలయాలకు ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆదేశాలు జారీ చేయడం మరో వింత. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై ఎట్టకేలకు శారదాపీఠం స్పందించింది. ఓ లేఖ ద్వారా వివరణను ఇచ్చింది. మూడు రోజులుగా స్వామి వారి జన్మదినోత్సవ వేడుకపై అసత్య ప్రచారం, అనవసర రాద్ధాంతం జరుగుతోందని శారదాపీఠం పేర్కొంది. మహాస్వామి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జన్మదిన మహోత్సవం రోజున ఆలయ మర్యాదలు కోరామని శారదపీఠం వెల్లడించింది.

‘‘సనాతన హైందవ ధర్మ పరిరక్షణే విశాఖ శ్రీ శారదాపీఠం ముఖ్య ప్రాధాన్యత. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చేయడానికి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానేందేంద్ర సరస్వతి మహాస్వామి చేస్తున్న కృషి విదితమే. గత మూడ్రోజులుగా మహాస్వామి వారి జన్మ దినోత్సవ వేడుకలపై అసత్యప్రచారం, అనవసర రాద్ధాంతం జరుగుతోంది. మహాస్వామి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జన్మదిన మహోత్సవం రోజున ఆలయ మర్యాదలు కోరాం. 2004 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆలయాల నుంచి మహాస్వామి వారికి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సాంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని విశాఖ శ్రీ శారదాపీఠం కోరడమైనది. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తాం’’ అని విశాఖ శారదాపీఠం వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.