తండ్రి ఆరోగ్యంపై స్పందించిన శివాత్మిక రాజశేఖర్

  • IndiaGlitz, [Monday,November 09 2020]

తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక రాజశేఖర్ స్పందించింది. ఇటీవల హీరో రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సిటి న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే తన తండ్రి ఆరోగ్యం స్లోగా మెరుగవుతోందని ట్విట్టర్ వేదికగా ఆయన కూతురు శివాత్మిక తెలిపింది.‘నాన్న స్లోగా కానీ ష్యూర్‌గా కోలుకుంటున్నారు. మీ అందరి ప్రార్థనలకు.. వెల్ విషెస్‌కు ధన్యవాదాలు. వియ్ లవ్ యు ఆల్’ అని శివాత్మిక ట్వీట్‌లో పేర్కొంది.

రాజశేఖర్ కుటుంబం మొత్తం ఒకేసారి కోవిడ్ బారిన పడింది. తొలుత కూతుళ్లిద్దరూ కోలుకున్నప్పటికీ.. జీవిత, రాజశేఖర్ మాత్రం ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయితే జీవిత కూడా క్రమంగా కోలుకున్నప్పటికీ రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో శివాత్మిక.. ‘‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ ట్వీట్ చేసింది.

కాగా.. అప్పటి నుంచి రాజశేఖర్‌ను సిటి న్యూరో సెంటర్ వైద్యులు నాన్ ఇన్వాసివ్ వెంటలేటర్ సపోర్ట్‌తో చికిత్సను అందించారు. ఆ తరువాత క్రమక్రమంగా రాజశేఖర్ కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన కోలుకోవడంతో నాన్ ఇన్వాసివ్ వెంటలేటర్ సపోర్ట్‌‌ను తొలగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని శివాత్మిక వెల్లడించడంతో రాజశేఖర్ అభిమానులు ఆనందిస్తున్నారు.

More News

కమలా హ్యారిస్‌ టీమ్‌లో శతృఘ్నసిన్హా సోదరుని కుమార్తె!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా.. బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా తాజాగా కమలా హ్యారిస్‌తోపాటు తన సోదరుని కుమార్తె ప్రీతీ సిన్హా

బైడెన్ ఏడాదికి మించి బతకరంటూ కంగన సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ ఒక గజిని అని..

కంటెస్టెంట్లను ఒక ఆట ఆడుకున్న సుమ.. ఎలిమినేట్ అయిన అమ్మ

‘నా పేరు చిన్నా’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్లందరికీ దీపావళి గిఫ్ట్స్ తీసుకొచ్చానని అయితే అవి దక్కించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ చేయాలని చెప్పారు.

మెగాస్టార్‌కు కరోనా.. రెండు రోజుల క్రితమే సీఎంను కలిసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. నిజానికి నేటి నుంచి `ఆచార్య` సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.

బాబాయ్‌, అబ్బాయ్ మ‌ల్టీస్టారర్‌

సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ కోసం అభిమానులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాంటి వాటిలో సీనియ‌ర్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్‌, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌.