close
Choose your channels

తెలంగాణలో షాకింగ్ కేసులు.. ప్రతి 4 టెస్టుల్లో ఒకటి కరోనా పాజిటివ్

Tuesday, June 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకటి పాజిటివ్ కావడం గమనార్హం. నిన్న 3189 శాంపిల్స్‌ను పరీక్షించగా వాటిలో 872 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8674కు చేరుకుంది. నిజానికి ఇంకా సరిగా టెస్టులు నిర్వహించడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.

పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహిస్తే ఇంకెన్ని కేసులు నమోదవుతాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిన్న తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 217కు చేరుకుంది. ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్న వారు 4452 కాగా.. 4005 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.