‘వకీల్‌సాబ్‌’కు డేట్స్ కేటాయించిన శృతి..!

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్. కాని గత ఏడాది కాలం నుంచి ఈమె న‌టించిన‌ ఒక్క సినిమా కూడా ద‌క్షిణాదిలో విడుదల కాలేదు. తమిళంలో ‘ఎస్3’, తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమాల తర్వాత శృతి.. దక్షిణాదిన దాదాపు కనుమరుగైపోయారు. ఈ క్రమంలో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు, అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు కథనాలు వినిపించాయి. లవ్ బ్రేకప్ కావడంతో శృతిహాస‌న్ మ‌ళ్లీ సినిమాలు, మ్యూజిక్ కాన్‌స‌ర్ట్‌ల‌పై ఫోక‌స్ చేసింది. ఆ క్ర‌మంలో ఈమె రెండు తెలుగు సినిమాల‌కు ఓకే చెప్పింది. అందులో ఒక‌టి ‘క్రాక్’ సినిమా కాగా.. మ‌రో చిత్రం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘వకీల్‌సాబ్‌’.

నిజానికి శృతి ‘వకీల్‌సాబ్‌’లో చేస్తున్న‌ట్లు చాలా రోజుల క్రిత‌మే వార్త‌లు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని ఆమె ప‌లు ఇంట‌ర్వ్యూలో చెప్పింది. అయితే ఆమె న‌టిస్తుంద‌ని ఇప్పుడు సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో శృతిహాస‌న్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. అలాగే అక్టోబ‌ర్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, శృతిహాస‌న్ మ‌ధ్య కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ‘గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు’ చిత్రాల త‌ర్వాత ప‌వ‌న్‌, శృతి క‌లిసి చేయ‌బోయే చిత్ర‌మిదే అవుతుంది.

More News

అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న దిల్‌రాజు

తెలుగు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. అనాథ‌లైన ముగ్గురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు.

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!

బిగ్‌బాస్ 4 కోసం నాగ్ రెడీ అయిపోతున్నారోచ్‌!!..ఇది అక్కినేని నాగార్జున అభిమానుల‌కే కాదు.. సినీ ప్రియుల‌లంద‌రికీ శుభ‌వార్తే.

అల్లు అర్జున్ 21... పాయింట్ అదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ త‌న కెరీర్‌ను చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) కరోనాతో మృతి చెందారు.

విశాఖ హిందూస్థాన్‌లో ప్రమాదం.. 11 మంది మృతి

విశాఖలో మరో ప్రమాదం సాగర వాసులను భయాందోళనలకు గురి చేసింది.