ఎంత ఫాస్ట్‌గా స్కూళ్లను తెరిచారో.. అంతే ఫాస్ట్‌గా మూసేశారు..!

  • IndiaGlitz, [Thursday,November 12 2020]

ముందూ వెనుక ఆలోచన లేకుండా గవర్నమెంట్ చేసిన పనికి ప్రస్తుతం అటు ఉపాధ్యాయులు.. ఇటు విద్యార్థులు.. తద్వారా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా గవర్నమెంట్.. స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చేసింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలే పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. తెరుచుకుని కొద్ది రోజులు గడవక ముందే ఉపాధ్యాయ సిబ్బంది.. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.

దీంతో తిరిగి స్కూళ్లను మళ్లీ మూసివేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. నవంబరు 2 నుంచి దేశంలోని పలు రాష్ట్రాలలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్ది రోజుల నుంచే ఉపాధ్యాయులు.. విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలోని స్కూళ్లలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఎంత ఫాస్ట్‌గా పాఠశాలలను తెరిచారో.. అంతే త్వరగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవలే తెరిచిన స్కూళ్లను తిరిగి మూసివేశారు. ఇక్కడ స్కూళ్లను తెరిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు 100 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో అక్కడ కూడా స్కూళ్లను మూసివేశారు. మిజోరంలో అక్టోబర్‌లోనే పాఠశాలలను తెరిచారు కానీ పెద్ద మొత్తంలో విద్యార్థులు కరోనా బారిన పడటంతో అక్కడి పాఠశాలలను సైతం వెంటనే మూసివేశారు. ఒడిశాలో కరోనా సెకెండ్ వేవ్‌పై అనుమానంతో ప్రభుత్వం పాఠశాలలను తెరవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

More News

క‌ళ్యాణ్ దేవ్ కొత్త చిత్రం ప్రారంభం

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. న్యూయార్క్‌ గవర్నర్ కీలక నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా మరోమారు తిరిగి విజృంభిస్తోంది.

ప్రి వెడ్డింగ్ షూట్‌‌లో విషాదం.. వధూవరులిద్దరూ మృతి

ఐదేళ్ల ప్రేమకు పెద్దలు కూడా రైట్ కొట్టారు. దీంతో ఆ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఇరువైపుల పెద్దలూ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు.

ప్రభాస్‌ చిత్రంలో బెల్లంకొండ..!

ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చిత్రంలో యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్నాడా? ఏ సినిమాలో అని అనుకుంటున్నారా..

కాబోయే వ్యక్తిని పరిచయం చేసిన అవికాగోర్‌

హీరోయిన్‌ అవికాగోర్‌ త్వరలోనే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నారు.