Sai Charan : అమెరికాలో విషాదం.. తెలుగు యువకుడిని కాల్చి చంపిన నల్లజాతీయుడు

  • IndiaGlitz, [Wednesday,June 22 2022]

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయ విద్యార్ధులు అక్కడి ఉన్మాదుల చేతుల్లో దారుణహత్యలకు గురవుతున్నారు. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుని కుటుంబానికి అండగా వుంటాడనుకున్న కుమారులు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోవడంతో కన్నవారు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా అమెరికాలో తెలుగు విద్యార్ధి హత్యకు గురయ్యాడు.

ఫ్రెండ్‌ను డ్రాప్ చేసి వెళ్తుండగా ఆగంతకుడి కాల్పులు:

వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన నక్కా సాయిచరణ్ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో దించి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాయి చరణ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణవార్తను స్థానిక అధికారులు సాయిచరణ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయిచరణ్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

Akash Puri: పూరీ జగన్నాథ్ దంపతుల విడాకుల వార్తలు... తేల్చేసిన ఆకాశ్ పూరీ

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్యలు విడిపోతున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాతో పాటు పలు వెబ్‌సైట్‌లలో

టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన షూటింగ్‌లు, యూనియన్ ఆఫీసులకు కార్మికులు

సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్‌లో సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. వేతనాల పెంపు జరిగే వరకు షూటింగ్‌లకు హాజరయ్యేది

Droupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి సింప్లిసిటీ... స్వయంగా చీపురుపట్టి ఊడ్చిన ద్రౌపది ముర్ము

దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోన్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే పక్షాల అభ్యర్ధిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును బీజేపీ ఎంపిక  చేసింది.

Vijay : విజయ్ సినిమా టైటిల్ ఇదే.. క్లాసీ లుక్‌లో అదరగొట్టేస్తోన్న ఇళయ దళపతి

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు చిత్ర పరిశ్రమపై దేశంలోని అన్ని ఇండస్ట్రీల స్టార్లు ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.

Janasena : జగన్ ఒక బకాసురుడు.. ఎంత అవినీతి సొమ్ము తిన్నా ఆకలి తీరదు: జనసేన నేత హరిప్రసాద్

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బకాసురుడు లాంటి వాడని, ఎంత అవినీతి సొమ్ము తిన్నా ఆయన ఆకలి తీరడం లేదంటూ దుయ్యబట్టారు జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డా.పి. హరిప్రసాద్ .