హీరో శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,June 22 2018]

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్సపై శ్రీ ఓం సినిమా సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా నారా రోహిత్ క్లాప్ కొట్టడం జరిగింది.

ఈ సందర్బంగా దర్శకుడు విజయ్ ఎల్ మాట్లాడుతూ... అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకేకథ చిత్రాల తరువాత ఈ సినిమాకు నిర్మాణ భాగస్వాయం చేస్తూ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. జులైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ... విజయ్ గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని ఏళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను అన్నారు.

నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ... డైరెక్టర్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా ఫీల్ అయ్యాను. సినిమాను త్వరగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. కథ చాలా విభిన్నంగా ఉండబోతోంది. ఒక మంచి సినిమాను అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ... ఆరెన్ మీడియా వర్క్స్ లో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ విజయ్ గారితో వర్క్ చెయ్యడం పాజిటివ్ గా ఉంటుంది. మంచి కథ బలం ఉన్న సినిమాకు వర్క్ చెయ్యడం ఆనందంగా ఉంది అన్నారు.

నటీనటులు: శ్రీవిష్ణు, రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్, రవి వర్మ తదితరులు.

More News

తండ్రి టి.కృష్ణ భావాల‌ను పుణికి పుచ్చుకున్న హీరో గోపీచంద్ 'పంతం' పెద్ద హిట్ కావాలి - దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. ఎన్నో హిట్‌ చిత్రాలకు వర్క్‌ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

ఆగ‌స్టులో రానున్న విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రాలు

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

మ‌హేష్ సినిమాలో అదితిరావ్ హైద‌రీ?

స‌మ్మోహ‌నం చిత్రంతో ఆక‌ట్టుకున్న క‌థానాయిక అదితి రావ్ హైద‌రీ. ఇందులో స‌మీరా రాథోడ్‌గా న‌టించి.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిందీ ముద్దుగుమ్మ‌.

చిరు చిన్న‌ల్లుడు ఖాతాలో మ‌రో చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజేత పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి నిర్మించ‌గా..

విజ‌య్ 'స‌ర్కార్‌'

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు.