ప్ర‌ముఖ నిర్మాత‌తో శ్రీ‌కాంత్ అడ్డాల‌?

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

కొత్త బంగారు లోకం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, విక్ట‌రీ వెంక‌టేష్‌ల‌తో సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు తెర‌కెక్కించాడు. మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. అయితే ఆ త‌ర‌వాత వ‌చ్చిన ముకుంద‌గానీ.. మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో మ‌రోసారి చేసిన బ్ర‌హ్మోత్స‌వం గానీ ఆయ‌న కెరీర్ కి ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

బ్రహ్సోత్స‌వం విడుద‌లై ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం పూర్త‌యినా.. శ్రీ‌కాంత్ నుంచి మ‌రో చిత్రం రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. శ్రీ‌కాంత్ త‌దుప‌రి చిత్రంకి రంగం సిద్ధ‌మైంద‌ని తెలిసింది. ఆరు నెల‌లుగా ఓ స్క్రిప్ట్ ప‌నిలో బిజీగా ఉన్న శ్రీ‌కాంత్‌.. అది పూర్త‌య్యాక ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ని క‌లిసార‌ని.. క‌థ న‌చ్చ‌డంతో శ్రీ‌కాంత్‌తో సినిమా చేసేందుకు అర‌వింద్‌ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది. కాగా, ఈ సినిమాని కొత్త బంగారు లోకం త‌ర‌హాలో యూత్‌ఫుల్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్కించే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

More News

ఆయ‌న చ‌ర్య‌కు బాధ‌ప‌డ్డానంటున్నహీరోయిన్‌...

ర‌జ‌నీకాంత్‌తో 'క‌బాలి' సినిమాలో..ఆయ‌న కూతురు పాత్ర‌లో న‌టించిన ధ‌న్సిన అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు బిజీ బిజీగా మారింది.

'జై సింహా' ఆడియో డేట్ ఫిక్స‌య్యింది

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 102వ చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార‌, న‌టాషా దోషి, హ‌రిప్రియ క‌థానాయిక‌లు.

2019 వేస‌వికి భార‌తీయుడు2?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ద్విపాత్రాభిన‌యంలో ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మా శ్రమకు ఫలితమే ఈ నంది పురస్కారం..- దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్

భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు సుధాకర్ గౌడ్.

75 రోజుల షాలిని

ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్  హీరో హీరోయిన్లుగా  షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్  సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వి. సత్యనారాయణ నిర్మించిన  "షాలిని'' చిత్రం ఇటీవలే విడుదలై 75 రోజులు పూర్తీ చేసుకున్న సందర్బంగా హైద్రాబాద్ లో 75 రోజుల వేడుక నిర్వహించారు.