శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో 'కుమారి 21ఎఫ్‌'

  • IndiaGlitz, [Monday,April 18 2016]

రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మించిన చిత్రం 'కుమారి 21ఎఫ్‌. ఈ చిత్రం' తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో సెవెన్‌ ఛానల్‌ మాణిక్యం నారాయణన్‌, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ సంయుక్తంగా కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు. గత 9 సంవత్సరాలుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో మంచి అనుభవం సంపాదించిన శ్రీమాన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌కుమార్‌ దగ్గర వర్క్‌ చేసి గుంటూర్‌ టాకీస్‌, ఒక మనసు చిత్రాలకు ఫోటోగ్రఫీ అందించిన రామిరెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తారు. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కథ, స్క్రీన్‌ప్లే: సుకుమార్‌, సమర్పణ: సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాతలు: సెవెన్‌ ఛానల్‌ మాణిక్యం నారాయణన్‌, ఎ.ఎన్‌.బాలాజీ, దర్శకత్వం: శ్రీమాన్‌

More News

అమ్మకు అఖిల్ అభినంద‌న‌

అమ్మ అమ‌ల‌కు అఖిల్ అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఇంత‌కీ ఎందుకు అభినందించాడంటే...నాగార్జున స‌హ‌కారంతో అమ‌ల బ్లాక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవ‌త్స‌రాలుగా  జంతువులను సంర‌క్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విష‌యం తెలిసిందే.

మే 6న వ‌స్తున్న స్పెష‌ల్ ఫిల్మ్ 24 అంద‌రికీ న‌చ్చుతుంది - సూర్య‌

సూర్య హీరోగా న‌టిస్తూ..నిర్మించిన చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టించారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై  24 మూవీని తెలుగు, త‌మిళ్ లో సూర్య నిర్మించ‌డం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన 24 మూవీని మే 6న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు

పూరి పై దాడి చేసాం అనేది అవాస్త‌వం - లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్

లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్స్ అభిషేక్, ముత్యాల రాందాసు, సుధీర్...త‌న పై దాడి చేసార‌ని డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం...పోలీసులు డిస్ట్రిబ్యూట‌ర్స్ పై కేసు న‌మోదు చేయ‌డం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న గురించి డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫిలిం ఛాంబ‌ర్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసారు.

ఈ నెల 23న వస్తున్న హారర్ ఎంటర్ టైనర్ 'శశికళ'

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్  తెలుగులో "శశికళ" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే.  భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూరి పై దాడి - పి.ఎస్ లో ఫిర్యాదు..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - మెగా హీరో వ‌రుణ్ తేజ్ తో తెర‌కెక్కించిన చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రం ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌లేదు. దీంతో లోఫ‌ర్ డిస్ట్ర‌బ్యూట‌ర్స్ ఆర్ధికంగా బాగా న‌ష్ట‌పోయారు.