కిడ్నాపింగ్ డ్రామాతో శ్రీనివాస్ చిత్రం?

  • IndiaGlitz, [Monday,March 05 2018]

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం సాక్ష్యం'. శ్రీవాస్ దర్శక‌త్వం వ‌హించారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు. ఇదిలా వుంటే.. శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని కూడా ఇప్ప‌టికే లైన్‌లో పెట్టేశారు. దాని చిత్రీకరణ కూడా మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయింది.

ప్రస్తుతం మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కిడ్నాపింగ్ డ్రామా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. యువ సంగీత సంచ‌ల‌నం తమన్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు. మల్టీ డైమెన్షన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన ఇద్ద‌రు హీరోయిన్‌లు నటించనున్నారు. వారిలో ఒకరిగా ఓ ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటివరకు శ్రీనివాస్.. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్‌తో నటించారు. ఈ నేపథ్యంలో ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రై ఉంటారా అనేది ప్రత్యేకతను సంతరించుకుంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

More News

మోహన్ లాల్ లాంచ్ చేసిన 'యుద్ధ భూమి' ట్రైలర్

ఇండో-పాక్ బోర్డర్ లో 1971లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని మలయాళంలో రూపొందిన చిత్రం'1971 బియాండ్ బోర్డర్స్'.

'భరత్ అనే నేను' కి అదే హైలైట్

'శ్రీమంతుడు'తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

విజయ్ దేవరకొండ హీరోగా కె.ఇ. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ చిత్రం ప్రారంభం

'పెళ్లిచూపులు' చిత్రంతో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చిన విజయ్ దేవరకొండ మలి చిత్రం 'అర్జున్ రెడ్డి' తో

తేజతో మరోసారి

విక్టరీ వెంకటేష్,సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా

ఎన్టీఆర్ కెమెరామేన్ తో రామ్

కుటుంబ కథా చిత్రాలతో..యువతను ఆకట్టుకునేలా సినిమాలను నిర్మించడంలో