close
Choose your channels

ఎన్టీఆర్ కెమెరామేన్ తో రామ్

Monday, March 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కుటుంబ కథా చిత్రాలతో.. యువతను ఆకట్టుకునేలా సినిమాల‌ను నిర్మించడంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ నుంచి ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం రానుంది. సినిమా చూపిస్త మావా`, నేను లోకల్` వంటి మాస్ ఎంటర్‌టైన‌ర్స్‌ను రూపొందించిన త్రినాథ్ నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రినాథ్ గత సినిమాలకు మాటలను అందించిన ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కూడా మాటలను అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బొమ్మరిల్లు, పరుగు`, మిస్ట‌ర్ పర్‌ఫెక్ట్‌`, నాన్నకు ప్రేమతో` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన విజయ్ సి. చక్రవర్తి ఈ సినిమాకి కూడా ఛాయాగ్రాహ‌కుడిగా పనిచేయ‌నున్నారని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే వారం నుంచి నిర‌వ‌ధికంగా చిత్రీకరణ జరుపుకోబోయే ఈ చిత్రాన్ని.. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని నిర్మాణ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.