‘దండుపాళ్యం’ శ్రీనివాసరాజు ‘18+ సినిమా’ లో సుమంత్‌ అశ్విన్‌

  • IndiaGlitz, [Thursday,March 05 2020]

లవర్స్‌, కేరింత చిత్రాల హీరో సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా, సలోని మిశ్రా కథానాయికగా.. దర్శకుడు శ్రీనివాసరాజు ‘దండుపాళ్యం 1, 2, 3’ చిత్రాల తర్వాత రూపొందిస్తున్న డిఫరెంట్‌ మూవీ ‘18+ సినిమా’. జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మకరంద్‌ దేశ్‌పాండే, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్‌ తమిళనాడులోని తిరువల్లూరులో వేసిన సెట్‌లో మార్చి 11 నుంచి 20 వరకు జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

సుమంత్‌ అశ్విన్‌, సలోని మిశ్రా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మకరంద్‌ దేశ్‌పాండే, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాత: ఎం.కోటేశ్వరరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.

More News

'నాకిదే ఫస్ట్‌టైమ్‌' ఆడియో అండ్‌ ట్రైలర్ లాంచ్‌!!

శ్రీ వల్లిక ఫిలింస్‌ పతాకంపై ధనుష్‌బాబు, సింధూర, కావ్యకీర్తి, హీరో హీరోయిన్లుగా రాంరెడ్డి ముస్కు దర్శకత్వంలో

పొలిటికల్ పొగరుతో దాడి చేశారు : రాహుల్ సిప్లిగంజ్

తెలుగు బిగ్‌బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో కొందరు వ్యక్తులు బీరు బాటిళ్లతో దాడి చేసిన విషయం విదితమే.

నిఖిల్‌ కొత్త చిత్రం '18 పేజీలు' ప్రారంభం

వరుస‌గా మంచి విజ‌యాలు సాధిస్తున్న నిఖిల్‌, బ‌న్నివాసు కాంబినేష‌న్ లో ఈరోజు ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది.

హైదరాబాద్‌లో థియేటర్లన్నీ మూసివేత!

టాలీవుడ్ పెద్దలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా పలు కీలక విషయాలపై చర్చించనున్నారు.

మే నెల‌లో అక్కినేని బ్ర‌ద‌ర్స్ సంద‌డి

ప్ర‌స్తుతం స్టార్ వార‌సులు ఎక్కువ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఒక్కొక్క‌సారి ఒకే నెల‌లో ఒకే కుటుంబానికి చెందిన హీరోలు పోటీ ప‌డాల్సి వ‌స్తుంది.