సుమంత్ సినిమా సిద్ధ‌మ‌వుతోంది

  • IndiaGlitz, [Wednesday,June 20 2018]

గ‌తేడాది విడుద‌లైన ఫీల్‌గుడ్ మూవీ 'మ‌ళ్ళీ రావా'తో చెప్పుకోద‌గ్గ విజ‌యాన్ని అందుకున్నారు సుమంత్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. అవే.. ‘ఇదం జగత్’, 'సుబ్ర‌మ‌ణ్య‌పురం'. వీటిలో ‘ఇదం జగత్’ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అంజు కురియన్ క‌థానాయిక‌గా న‌టించిన‌ ఈ సినిమాకి అనిల్ శ్రీకంఠం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా.. ఈ నెలాఖ‌రున టీజర్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అలాగే సినిమాని జూలై ద్వితీయార్థంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. వైవిధ్య‌మైన కథ కథనాలతో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం తనకు మ‌రో మంచి విజయాన్ని అందిస్తుందన్న న‌మ్మ‌కంతో ఉన్నారు సుమంత్‌.

More News

విశాల్‌ 'అభిమన్యుడు'ని అభినందించిన సూపర్‌స్టార్‌ మహేష్‌

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్స్‌ పై ఎమ్‌.

జులై 6 వస్తొన్న'దివ్యమణి' 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలొ నిర్మిస్తున్న చిత్రం 'దివ్య మణి'.

డా.వై ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌ "యాత్ర" షూటింగ్ ప్రారంభం

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గా రాష్ట్ర‌రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ లొ మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

పేపర్ బాయ్ సినిమా చిత్రీకరణ పూర్తి

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా 'పేపర్ బాయ్'.

నానికి జోడీగా శ్రుతి హాస‌న్‌?

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాస‌న్‌. తెలుగులో దాదాపు అగ్ర హీరోలంద‌రితోనూ సినిమాలు చేసిన శ్రుతి..