సూపర్ హిట్ రీమేక్‌లో హీరోగా సునీల్...

  • IndiaGlitz, [Wednesday,December 23 2020]

హాస్యనటుడిగా కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ.. హీరోగా మారి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి.. అనంతరం ఆ పాత్ర.. ఈ పాత్ర అని కాకుండా నటనకు ప్రాధాన్యమున్న.. ప్రేక్షకుడికి నచ్చే పాత్రలతో దూసుకుపోతున్న నటుడు సునీల్. ప్రస్తుతం రీమేక్‌ల యుగం నడుస్తోంది. హీరోలంతా తమకు నచ్చిన.. సూపర్ హిట్ సినిమాల రీమేక్‌లతో అభిమానులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా సునీల్ కూడా నడుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘బెల్‌బాటమ్’. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘ఆహా’ద్వారా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి డిటెక్టివ్‌గా నటించారు. ఈ సినిమాను తెలుగులో సునీత్‌తో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఈ సినిమా కథ సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోతుందని తెలుస్తోంది. అయితే సినిమాకు దర్శకుడు మాత్రం ఇంకా సెట్ అవనట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఆగితే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More News

మెగాస్టార్‌ను క‌లిసి మంచు హీరో.. కార‌ణం మ‌ళ్లీ చెబుతాడ‌ట‌... !

మెగాస్టార్ చిరంజీవికి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబుకి ఒకానొక సంద‌ర్భంలో మ‌న‌స్ప‌ర్ధ‌లు బాగానే ఉండేవి.

కొత్త రకం కరోనా వేరియంట్ విషయమై గుడ్ న్యూస్!

కొత్త రకం కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో పలు దేశాలు యూకేకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

జిమ్‌కి వెళుతూ కారులో ఆ సినిమా పాటలు వింటూ ఉండేవాడిని: రామ్ చరణ్

లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీ కంటెంట్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.

కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదు.. ఆందోళన వద్దు: కేంద్రం

పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది.

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.