బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ పై క్రిష్ణ స్పంద‌న‌

  • IndiaGlitz, [Saturday,January 02 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. స‌త్య‌రాజ్, జ‌యసుధ‌, రేవ‌తి, న‌రేష్, రావు రమేష్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది.

ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ గురించి క్రిష్ణ స్పందిస్తూ...బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ చూసాను. చాలా బాగుంది. మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌న్నింటి క‌న్నా...ఈ సినిమాలో చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. టీజ‌ర్ చూస్తుంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా ఏప్రిల్ 29న బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. స‌మ్మ‌ర్ రిలీజ్ అయ్యే సినిమాల్లో బ్ర‌హ్మోత్స‌వం నెంబ‌ర్ వ‌న్ గా నిలుస్తుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

More News

మహేష్ టీజర్ కాపీనా..?

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కిల్లింగ్ వీర‌ప్ప‌న్ న్యూ రిలీజ్ డేట్..

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం కిల్లింగ్ వీర‌ప్ప‌న్. గంథ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన విష‌యం తెలిసిందే.

విడుదలకు రెడీ అవుతోన్న 'తుంటరి'

కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెం.2లో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తుంటరి'.బాణం,సోలో, సారొచ్చారు,ప్రతినిధి,రౌడీఫెలో వంటి సినిమాలతో తనదైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్.

'కథకళి' రిలీజ్ డేట్...

పందెంకోడి,పొగరు,భరణి,ఇంద్రుడు,పూజ,జయసూర్య వంటి మాస్ కమర్షియల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన మాస్ హీరో విశాల్

నిర్మాతలుగా మారుతున్న మహేష్ డిస్ట్రిబ్యూటర్స్

శ్రీమంతుడు,రుద్రమదేవి,నాన్నకు ప్రేమతో సహా పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ త్వరలోనే నిర్మాతలుగా మారుతున్నారు.