ప్ర‌భాస్‌కి సాహో అన‌బోతున్న సురేంద‌ర్‌

  • IndiaGlitz, [Monday,November 04 2019]

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌దుప‌రి 'సాహో' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా రూ.430 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది కంటే ఉత్త‌రాదినే సాహో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'జాన్‌' అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సినీ వ‌ర్గాల స‌మాచాచారం.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్‌ను డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కలిశాడ‌ట‌. రీసెంట్‌గా సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సైరా న‌ర‌సింహారెడ్డి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే.

సైరా త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ఎలాంటి సినిమా చేస్తాడ‌నే ఆస‌క్తితో పాటు ఎవ‌రితో చేస్తాడ‌నే ఆస‌క్తి కూడా నెల‌కొంది. ఇలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌హ‌కారంతో ప్ర‌భాస్‌ను సురేంద‌ర్ రెడ్డి క‌లిసి క‌థ‌ను వినిపించాడ‌ట‌. ప్ర‌భాస్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయ‌మ‌ని చెప్పిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అంతా ఓకే అయితే దిల్‌రాజు నిర్మాణంలో ప్ర‌భాస్‌, సురేంద‌ర్ రెడ్డి సినిమా తెర‌కెక్కుతుంది.

More News

పవన్.. బాబును నమ్ముకుంటే..!: ఆమంచి సంచలన వ్యాఖ్యలు

విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’ సక్సెస్ అయ్యింది.

విడుద‌ల‌కు సిద్ధ‌మైన సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ 'బొంభాట్‌'

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై

చాగంటితో వివాదాలపై క్లారిటీ ఇచ్చుకున్న గరికపాటి!

తెలుగు రాష్ట్రాల్లో భక్తజన అభిమానాన్ని పొందిన ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తల్లో మొదట గుర్తొచ్చేది చాగంటి కోటేశ్వరరావు,

ప్రారంభమైన సందీప్ కిష‌న్ 'A1 ఎక్స్‌ప్రెస్‌'

నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

'తిప్ప‌రామీసం' సినిమాను అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి హీరో హీరోయిన్లుగా రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓం సినిమా బ్యాన‌ర్స్‌పై రిజ్వాన్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం