స్వాతి మళ్లీ ఎంట్రీ ఇస్తుంది...

  • IndiaGlitz, [Saturday,February 18 2017]

క‌ల‌ర్స్ స్వాతిగా తెలుగు సినీ ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన స్వాతి త‌ర్వాత హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ త‌ర్వాత స్వాతి మ‌రే సినిమా చేయ‌లేదు. స్వాతి క‌థ కంచికే అని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో ఇప్పుడు స్వాతి మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ర‌వికాంత్ పేరెపు వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖలో ప‌నిచేసిన ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమాలో గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క స‌మాచ‌రం త్వ‌ర‌లో వెలువ‌డ‌నుంది.

More News

హీరోయిన్ కిడ్నాప్ , లైంగిక వేధింపులు...

ఒంటరి,మహాత్మ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళం,కన్నడ,మలయాళంలో సినిమాలు చేసిన హీరోయిన్ భావన అందరికీ గుర్తుండే ఉంటుంది.

భారతీయులందరూ తప్పక చూడాల్సిన గొప్ప భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' - కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు

అక్కినేని నాగార్జున..హాథీరామ్ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'.

రజనీకాంత్ అప్పుడే రెడీ అయిపోతున్నాడు...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ 2.0 శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డి.జె.దువ్వాడ జగన్నాథమ్ ' ఫస్ట్ లుక్ రిలీజ్

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`,`సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా,

రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ లవ్ స్టోరీ తెరకెక్కనుందా...?

మాజీ ప్రధాని, క్రాంగెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత రాజకీయంగా జరిగిన పరిణామాలతో రాజీవ్ గాంధీని ఎల్.టి.టి.ఇ చంపేయడంతో సోనియా గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.