'సైరా నరసింహా రెడ్డి'కి బ్రేక్ ప‌డింది

  • IndiaGlitz, [Tuesday,April 17 2018]

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రధారిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఇందులో.. ఆంగ్లేయులను ఎదిరించిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి క‌నిపించ‌నున్నారు. నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్‌ ఇత‌ర‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల రెండో షెడ్యూల్‌ను ప్రారంభించిన చిత్ర బృందం.. ఈ షెడ్యూల్‌లో అమితాబ్‌కు సంబంధించిన అన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించి.. అప్పుడు బ్రేక్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే.. వ్యక్తిగత కారణాల రీత్యా చిరంజీవి హఠాత్తుగా అమెరికా పయనం కానుండ‌డంతో.. ఈ షెడ్యూల్‌కి బ్రేక్ ఇవ్వక తప్పడంలేదు. దాంతో బిగ్ బీ కూడా ముంబైకు పయనమైపోయారు. చిరు అమెరికా నుంచి వచ్చిన తర్వాత.. తిరిగి ఈ షెడ్యూల్ ప్రారంభం కానున్న‌ట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తమన్నా దాదాపు ఖ‌రార‌య్యార‌ని తెలిసింది. ముందుగా ఈ పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ను సంప్రదించారట. ఆమె సున్నితంగా తిరస్కరించడంతో ఇప్పుడు ఆ అవకాశం తమన్నాను వరించింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

రామ్ చ‌ర‌ణ్ సినిమా టైటిల్ ఏంటంటే..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో

త‌న నిర్మాత‌కు జోడీగా నివేదా?

యువ కథానాయకుడు నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా

ఈ ఏడాది దసరాకి రామ్ చరణ్ సినిమా లేనట్టేనా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా మాస్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో

'మ‌హాన‌టి'.. కొన్ని సీన్స్ మాత్ర‌మే

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'మ‌హాన‌టి'.

భూమిక‌.. ఈ చిత్రాల‌తో బ్రేక్ చేస్తుందా?

‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి ఘ‌న‌విజ‌యాల‌తో స్టార్‌డ‌మ్‌ను పొందిన‌ కథానాయిక భూమిక చావ్లా.