'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

  • IndiaGlitz, [Friday,March 09 2018]

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా.. తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ - ''పెరిగిన టెక్నాలజీలో సైబర్‌ క్రైమ్‌ను ఎలా చేస్తున్నారనే విషయాలను గమనిస్తూనే ఉన్నాం. దీన్ని ఓ మెసేజ్‌ క్రింద చూపిస్తూ 'ఐతే 2.0'ను రూపొందించారు. కొత్త టీంతో ఏర్పడ్డ ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు. మెసేజ్‌తో పాటు ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ సినిమాలను ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

దర్శకుడు రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ - ''ఈ సినిమాకు సంబంధించిన యు.ఎస్‌ హక్కులను ఫ్యాన్సీరేటుకు దక్కించుకున్నారు. ఆ ఆనందంలో ఉన్న సమయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌గారి చేతులు మీదుగా ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ - ''ట్రైలర్‌ను తలసానిగారు విడుదల చేయడం హ్యాపీ. ఆయనకు మా టీం తరపున థాంక్స్‌. టెక్నికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది'' అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, ఎడిటింగ్‌: కార్తీక్‌ పల్లె, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్‌ చిలువేరు. నిర్మాతలు : కె.విజయరామరాజు, డా.హేమంత్‌ వల్లపు రెడ్డి దర్శకత్వం: రాజ్‌ మాదిరాజ్‌.

More News

రామ్ సినిమా తోనూ కొన‌సాగించిన ద‌ర్శ‌కుడు

గ‌తేడాది విడుద‌లైన 'నేను లోకల్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నిఖిల్ రెండు చిత్రాలు అలాగే..

యువ క‌థానాయకుడు నిఖిల్ గ‌త రెండేళ్ళుగా ఏడాదికో సినిమాతో సంద‌డి చేసారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విశేష‌మేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలు కావ‌డం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 16న నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' విడుద‌ల కానుంది.

'కొండవీటి దొంగ' కు 28 ఏళ్ళు

''ఉన్నవాడిని కొల్లగొట్టి లేనివాడికి పెట్టు" అనే రాబిన్ హుడ్ సిద్ధాంతంతో తెరకెక్కిన చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచిన హిట్ మూవీ ఇది.

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: శ్రీకాంత్

ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం  కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది..  గాసిప్స్  అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లే

విడుదలకు సిద్ధమైన మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.