'సరిహద్దు' సైనికుడుగా తనీష్

  • IndiaGlitz, [Thursday,January 17 2019]

మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.. ఒక్కోసారి అది జాతీయ సమస్యగానూ మారొచ్చు.. అలా మారకుండా చూసే శక్తి ఆర్మీ. సైనికుడు సరిహద్దుకు కాదు దేశానికే రక్షకుడు. ఇదే కాన్సెప్ట్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా రంగుతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. అంటే రంగు కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట. నేషనలైజ్డ్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ కూడా ‘సరిహద్దు’.

ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ భాషను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించాలనుకొని...ప్రతి భాషకు ఒక తెగ అనీ...కొన్ని తెగలకు ఒక కులం అనీ.. కొన్ని కులాలు కలసి ఒక మతం అనీ విడిపోతూ మృగలనుండి మనుషులుగా.. మనుషులనుండి తెగలుగా ... తెగలనునుండి..కులాలుగా..కులాలనుండి మతాలుగా.... మతాలనుండి రాష్ట్రాలుగా.... రాష్ట్రాలనుంచి దేశాలుగా..సరిహద్దుల్ని గీసుకొంటూ...బతుకుతున్నాం.
ఈ కాన్సెప్ట్ తో సరిహద్దు రూపొందబోతుంది అన్నారు.

దర్శకుడు కార్తికేయ, హీరో తనీష్ ‘రంగు’ సినిమాతో అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు. అందుకే మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ సారి అంచనాలు కూడా ఉంటాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఓ అద్భుతమైన కథతోనే మళ్లీ వస్తున్నారు ఈ ఇద్దరు. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతో పాటు హిందీ భాషా నటులు కూడా నటిస్తారు. ప్రస్తుతం టైటిల్ తోనే విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ టీమ్.. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను ఈ నెలాఖరులో తెలియజేయబోతున్నారు.

More News

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా 'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ ఫంక్షన్

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’.

'కేసీఆర్ అనే నేను..' అసెంబ్లీలో రెండోసారి..!!

తెలంగాణ ఎన్నికల్లో కనివీని ఎరుగని రీతిలో గెలిచిన టీఆర్ఎస్‌‌.. కేసీఆర్‌‌ను రెండో దఫా సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.

నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది - హీరో గౌతమ్

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ, డా: బ్రహ్మానందం  ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు

వైఎస్ జగన్- కేసీఆర్ కింగ్ మేకర్స్ అవుతారా..!?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వేదికగా చక్రం తిప్పబోతున్నారా..? కేసీఆర్‌ ఫ్రంట్‌‌‌కు రోజురోజుకు బలం పెరుగుతోందా..?.

నెటిజన్‌ను బండ బూతులు తిట్టిన రకుల్ ప్రీత్!

సోషల్ మీడియాను కొందరు అనవసర విషయాలకు వాడుతూ చేజేతులారా లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రటీలను టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు వాడిన పదజాలంతో జైలుపాలైన సందర్భాలున్నాయ్.