చిలకలూరిపేట సభకు భూమి పూజ.. పాల్గొన్న టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు..

  • IndiaGlitz, [Wednesday,March 13 2024]

ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సంయుక్తంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణానికి భూమి పూజ చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ నేతృత్వంలో వేదిక నిర్మాణానికి మూడు పార్టీల నేతలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం నుంచి రాక్షస పాలనను పారదోలేందుకు మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ సభను ప్రజలంతా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. 2014 తర్వాత మూడు పార్టీలు కలిసి ఏర్పాటుచేస్తున్న సభ కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

అందులోనూ ప్రధాని మోదీతో పాటు టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనుండటంతో భారీ జనసమీకరణ, ట్రాఫిక్, సెక్యూరిటీ ఇతర అన్ని అంశాలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జరిగే ఈ సభకు సుమారు ఐదు లక్షల మందికిపైగా జనం వస్తారని అంచనా వేస్తు్న్నాయి. అందుకు తగ్గట్లే 100 ఎకరాలకు పైగా స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సభను విజయవంతం చేయడానికి మూడు పార్టీల నేతలు శ్రమిస్తు్న్నారు.

ఈ సమావేశానికి హాజరయ్యే ప్రధాని విమానం కొరిశపాడు జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా భద్రతా సిబ్బందితో పాటు ఎయిర్‌పోర్స్ స్టాఫ్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీ నారాయణ, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, లంకా దినకర్ పాల్గొన్నారు.

కాగా 2014 ఎన్నికల సమయంలో మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అప్పుడు తిరుపతిలో జరిగిన సభలో ముగ్గురు నేతలు హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఈ సభ వేదికగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు కీలక హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సభ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సభ కోసం ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని టీడీపీ నేతలు ఆర్టీసీ ఎండీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన అధికారులు ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున తరలిరానున్నట్లు నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు స్పష్టతకు వచ్చాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల నుంచి బరిలో దిగనున్నాయి. ఇక 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మొత్తానికి 2014 ఎన్నికల సీన్ రిపీట్ చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు.

More News

వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి మార్పు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ..

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లకు TG ప్రిఫిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి గతంలో

డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు.. కొత్త రేషన్ కార్డులు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది

PawanKalyan: భీమవరాన్ని వదలను.. కచ్చితంగా గెలిచి తీరాలి: పవన్ కల్యాణ్‌

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్‌ స్పందించారు. సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండని..175 స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీలు పోటీ చేస్తున్నాయని

Pawan Kalyan: చంద్రబాబు వ్యూహంలో చిక్కుకుపోయిన జనసేనాని.. రగిలిపోతున్న కార్యకర్తలు..

రాష్ట్ర రాజకీయాలను మారుస్తాను.. అధికారంలో భాగస్వామ్యం అవుతాం.. అంటూ బీరాలు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఎంతలా అంటే పొత్తులో భాగంగా 175 సీట్లలో కేవలం 24 సీట్లు,

Bhatti Vikramarka: యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ట్రోల్స్‌కు కౌంటర్..

యాదాద్రి వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను అని స్పష్టంచేశారు. ఈ ఫోటోను పట్టుకుని కావాలని కొందరు